Homeటాప్ స్టోరీస్ప‌వ‌న్ సినిమాపై క్రిష్ క్లారిటీ!

ప‌వ‌న్ సినిమాపై క్రిష్ క్లారిటీ!

ప‌వ‌న్ సినిమాపై క్రిష్ క్లారిటీ!
ప‌వ‌న్ సినిమాపై క్రిష్ క్లారిటీ!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల విష‌యంలో స్పీడు పెంచిన విష‌యం తెలిసిందే. రెండేళ్ల విరామం త‌రువాత సినిమాల్లో న‌టించ‌డం మొద‌లుపెట్టిన ప‌వ‌ర్‌స్టార్ `వ‌కీల్ సాబ్‌` చిత్రంతో పాటు క్రిష్ద ద‌‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా చిత్రం చేస్తున్నారు. చారిత్ర‌క నేప‌థ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. మొఘ‌‌ల్ సామ్రాజ్యం కోహినూర్ వ‌జ్రం చుట్టూ ఈ సినిమా సాగ‌నుంది.

ఏ.ఎం. ర‌త్నం అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ ఇప్ప‌టికే సైలెంట్‌గా రెండు కీల‌క షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. క‌రోనా వైర‌స్ కార‌ణంగా గ‌త ఐదు నెల‌లుగా ఈ చిత్ర షూటింగ్‌ని వాయిదా వేశారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ కూడా వ్యాక్సిన్ వ‌చ్చిన త‌రువాతే ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటాన‌ని చెప్ప‌డంతో క్రిష్ ఈ చిత్రాన్ని త‌త్కాలికంగా ప‌క్క‌న పెట్టారు. అయితే ఈ చిత్రం ఆగిపోయిందంటూ ప్ర‌చారం మొద‌లైంది. ఆ కార‌ణంగానే పంజా వైష్ణ‌వ్ తేజ్‌తో క్రిష్ సినిమా మొద‌లుపెట్టార‌ని రూమ‌ర్స్ మొద‌ల‌య్యాయి.

- Advertisement -

ఈ రూమ‌ర్స్‌పై ద‌ర్శ‌కుడు క్రిష్ స్పందించారు. ప‌వ‌న్‌తో చేస్తున్న సినిమా ఆగిపోలేద‌ని, క‌రోనా వైర‌స్ నేప‌థ్య‌లో ఈ చిత్ర షూటింగ్‌కి చిన్న బ్రేకిచ్చామ‌ని, ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో మార్పులు చోటుచేసుకున్న త‌రువాత వ‌చ్చే ఏడాది తిరిగి ప‌వ‌న్ సినిమా షూటింగ్‌ని పునః ప్రారంభిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All