Homeటాప్ స్టోరీస్క్రిష్‌, వైష్ణ‌వ్ తేజ్‌, ర‌కుల్ కాంబో మూవీ స్టార్ట్‌!

క్రిష్‌, వైష్ణ‌వ్ తేజ్‌, ర‌కుల్ కాంబో మూవీ స్టార్ట్‌!

క్రిష్‌, వైష్ణ‌వ్ తేజ్‌, ర‌కుల్ కాంబో మూవీ స్టార్ట్‌!
క్రిష్‌, వైష్ణ‌వ్ తేజ్‌, ర‌కుల్ కాంబో మూవీ స్టార్ట్‌!

చిరంజీవి మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్‌తేజ్ సోద‌రుడు పంజా వైష్ణ‌వ్ తేజ్ హీరోగా `ఉప్పెన‌` చిత్రంతో తెరంగేట్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఏప్రిల్‌లో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం విడుద‌ల ఇప్ప‌టికీ ప్ర‌శ్నార్థ‌కంగానే మిగిలిపోయింది. ఇదిలా వుంటే ఈ సినిమా రిల‌జ్ కాకుండానే పంజా వైష్ణ‌వ్ తేజ్ మ‌రో చిత్రాన్ని ప్రారంభించేశాడు. క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది.

ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని క్రిష్ ఫ్రెండ్ రాజీవ్‌రెడ్డి, తండ్రి సాయిబాబా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ‌నివారం నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించి అక్టోబ‌ర్ ఎండింగ్ వ‌ర‌కు జ‌రిగే సింగిల్ షెడ్యూల్‌లో చిత్రాన్ని పూర్తి చేయాల‌ని ద‌ర్శ‌కుడు క్రిష్ ప్లాన్ చేశార‌ట‌.  ఇందులో వైష్ణ‌వ్ తేజ్‌కు జోడీగా ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తోంది.

- Advertisement -

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో క్రిష్ ఓ భారీ పాన్ ఇండియా స్థాయి పిరియాడిక్ చిత్రాన్ని రూపొందిస్తున్న విష‌యం తెలిసిందే. ఏ.ఎం.ర‌త్నం అత్యంత భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే టూ షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది. క‌రోనా వైర‌స్ కార‌ణంగా షూటింగ్‌ని మ‌ధ్య‌లోనే ఆపేశారు. న‌వంబ‌ర్ నుంచి మ‌ళ్లీ షూటింగ్ మొద‌లుపెట్టాల‌ని క్రిష్ ప్లాన్ చేస్తున్నారు. ఆలోపు వైష్ణ‌వ్ తేజ్ చిత్రాన్ని పూర్తి చేసి ప‌వ‌న్ మూవీని ప‌ట్టాలెక్కిస్తార‌ట‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All