పవర్స్టార్ పవన్కల్యాణ్ సినిమాల విషయంలో మునుపెన్నడూ లేనివిధంగా స్పీడు పెంచారు. ఏడాదికి, రెండేళ్లకు ఒకే ఒక్క చిత్రాన్ని చేస్తూ వచ్చిన పవర్స్టార్ తాజాగా వేగం పెంచారు. క్రీయాశీల రాజకీయాల్లోకి ప్రవేశించి సినిమాలకు దూరంగా వుంటూ వచ్చిన పవన్ కల్యాణ్ ఒక్కసారిగా స్పీడు పెంచేసి షాకుల మీద షాకులిస్తున్నారు. ఇప్పటికే ఆయన నటిస్తున్న `వకీల్ సాబ్` చిత్రం చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది.
ఈ సినిమాతో పాటు క్రిష్ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న పిరియాడిక్ మూవీని చేస్తున్నారు. కరోనా వైరస్ ప్రబలడానికి ముందు ఈ మూవీ సైలెంట్గా టు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఏ.ఎం. రత్నం అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా తరువాత హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ నిర్మించనున్న యాక్షన్ ఎంటర్టైనర్ని కూడా ఓకే చేసిన విషయం తెలిసిందే.
ఇదిలా వుంటే తాజాగా పవర్స్టార్ మరో చిత్రాన్ని కూడా అంగీకరించినట్టు తెలిసింది. ఈ చిత్రాన్ని స్టైలిష్ డైరెక్టర్ సురేందర్రెడ్డి తెరకెక్కించనున్నారట. ఎస్ ఆర్ టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి నిర్మించబోతున్నారని తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ సెప్టెంబర్ 1న రానుందని తెలిసింది. సెప్టెంబర్ 2న పవర్స్టార్ పవన్ కల్యాణ్ బర్త్డే అన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎస్ ఆర్ టీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పవన్ చిత్రాన్ని ప్రకటించనున్నట్టు తెలిసింది. ఇది పవన్ నటించనున్న 29వ చిత్రం.