సెలబ్రిటీలు చేసే చిన్నతప్పులే వారి పాలిట ప్రస్తుతం శాపాలుగా మారుతున్నాయి. కరోనా స్వైర విహారం చేస్తున్న ఈ సమయంలో ఎన్ని జాగ్రత్తలు పాటించినా చిన్న ఏమర పాటు కారణంగా కరోనా బారిన పడుతున్నారు. 60 పైబడి వాళ్లే ఎక్కువగా కరోనా బారిన పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా మంది కరోనా బారిన పడుతున్నారు.
ఇటీవల గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం కరోనా కారణంగా మృత్యు వాత పడ్డారు. కరోనా కారణంగా గత నెల రోజులుగా తీవ్ర అనారోగ్యానికి గురైన హీరో డా. రాజశేఖర్ సోమవారం డిశ్చార్జ్ అయ్యారు. అదే రోజు మెగాస్టార్ చిరంజీవి తనకు కరోనా పాజిటివ్ అని తేలిందని చెప్పడంతో మెగా ఫ్యాన్స్ షాక్కు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా వుండాలని త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తున్నారు.
ఇదిలా వుంటే గత ఏడు నెలలుగా బయట కనిపించకుండా ఫామ్ హౌస్కే పరిమితమైన పవర్కల్యాణ్ తాజాగా `వకీల్సాబ్` షూటింగ్ కోసం మెల్రోలో సందడి చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సెట్లో సందడి చేస్తున్న పవన్ ఆరోగ్యంపై ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారట. షూటింగ్ తరువాతైనా చేసుకోవచ్చని, సామాజిక దూరం పాటించాలని పవన్ ఫ్యాన్స్ భయపడుతున్నారట. చిరుకు వైరస్ సోకిన నేపథ్యంలో పవన్ జాగ్రత్తలు పాటించాలని, షూటింగ్లకు దూరంగా వుండాలని పవన్కి విజ్ఞప్తి చేస్తున్నారట.