టాలీవుడ్ లో టాప్ స్టార్స్ అంటే టక్కున చెప్పే పేర్లు పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు . అయితే ఈ ఇద్దరు హీరోలు నటించిన 25 వ సినిమా ఘోర పరాజయం పొందాయి . మహర్షి ఇంకా మంచి వసూళ్ల ని సాధిస్తోంది అయితే భారీ బడ్జెట్ కావడంతో బయ్యర్ లకు నష్టాలు వస్తున్నాయి కొన్ని చోట్ల మహర్షి బయ్యర్లు సేఫ్ అయ్యారు కానీ కీలకమైన ఓవర్ సీస్ , రాయలసీమ బయ్యర్లు మాత్రం ఘోరంగా నష్టపోతున్నారు .
ఇక పవన్ కళ్యాణ్ 25 వ సినిమా అజ్ఞాతవాసి విషయానికి వస్తే ….. ఈ సినిమా ఘోర పరాజయం పొందింది . బయ్యర్లను నిలువునా ముంచింది . 25 వ సినిమా అని ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఇలా రోడ్డున పడేయడంతో షాక్ అయ్యారు . కట్ చేస్తే ఇప్పుడు మహేష్ బాబు 25 వ సినిమా మహర్షి కూడా కొంతమందిని తీవ్రంగా నష్టపరుస్తోంది . దాంతో పవన్ కళ్యాణ్ కు అలాగే మహేష్ బాబు కు 25 వ సినిమా కలిసి రాలేదని వాపోతున్నారు .