Homeగాసిప్స్మ‌హేష్‌తో సినిమా ప‌ర‌శురామ్ డ్రీమా?

మ‌హేష్‌తో సినిమా ప‌ర‌శురామ్ డ్రీమా?

మ‌హేష్‌తో సినిమా ప‌ర‌శురామ్ డ్రీమా?
మ‌హేష్‌తో సినిమా ప‌ర‌శురామ్ డ్రీమా?

టాలీవుడ్‌లో వున్న యంగ్ డైరెక్ట‌ర్‌ల‌లో పెన్ను ప‌వర్ వున్న డైరెక్ట‌ర్‌ల‌లో ముందు వ‌రుస‌లో వుండే ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్‌. పూరీ త‌ర‌హాలో ట‌పాసుల్లాంటి డైలాగ్‌ల‌ని హీరోల చేత పేల్చేయ‌గ‌ల స‌త్తా ప‌ర‌శురామ్ సొంతం. చిన్న లైన్‌ని తీసుకుని `గీత గోవిందం` చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకున్నారు. స్టార్ హీరో మ‌హేష్‌తో సినిమా చేయాల‌ని ఎన్నో ఏళ్లుగా ఎద‌రుచూస్తున్నాడ‌ట‌ ప‌ర‌శురామ్ అత‌ని డ్రీమ్ త్వ‌ర‌లోనే నెర‌వేర‌బోతోంది. త్వ‌ర‌లో మ‌హేష్ బాబుతో క‌లిసి ప‌ర‌శురామ్ ఓ భారీ చిత్రాన్ని చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే.

గీతా ఆర్ట్స్‌లో మ‌హేష్ హీరోగా సినిమా వుంటుంద‌ని గ‌త కొన్ని నెల‌లుగా వార్త‌లు జోరుగా వినిపించాయి. దానికి ప‌ర‌శురామ్ ద‌ర్శ‌కుడిగా ప‌నిచేయాల‌నుకున్నారు. కానీ ఆ బ్యాన‌ర్‌లో ప్రాజెక్ట్ ముందుకు సాగ‌లేదు. ఇక త‌న క‌ల నిజం కాద‌ని ఫీలైన ప‌రశురామ్ 14 ప్ల‌స్ రీల్స్ బ్యాన‌ర్‌లో నాగ‌చైత‌న్య హీరోగా ఓ సినిమాకు సిద్ధ‌మైపోయారు. `నాగేశ్వ‌రరావు` అనే టైటిల్‌ని కూడా అనుకున్నారు. ఇదిలా వుండ‌గా ప‌రుశురామ్ డ్రీమ్ గురించి తెలుసుకున్న ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ త‌న‌ని మ‌హేష్ ద‌గ్గ‌రికి తీసుకెళ్ల‌డం, మ‌హేష్‌కి ప‌ర‌శురామ్‌తో క‌థ చెప్పించ‌డం, అది మ‌హేష్ న‌చ్చ‌డంతో ఎన్నో ఏళ్లుగు ఎద‌రుచూస్తున్న ప‌ర‌శురామ్ డ్రీమ్ ఒక్క‌సారిగా నిజం కావ‌డం మొద‌లైంది.

- Advertisement -

మ‌హేష్ ఓకే చెప్పిన క‌థ‌కి ప‌ర‌శురామ్ ప్ర‌స్తుతం తుదిమెరుగులు దిద్దుతున్నారు. త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ కావ‌డంతో ఈ చిత్రాన్ని మెమ‌ర‌బుల్ ఫిల్మ్‌గా తెర‌కెక్కించాల‌ని మ‌రింత‌గా మెరుగుల‌ద్దుతున్నార‌ట‌. మైత్రీ మూవీమేక‌ర్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మించ‌నున్న ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్య‌క్ర‌మాలు త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్నట్టు తెలిసింది. స‌రికొత్త క‌థ‌తో తెర‌పైకి రానున్నా ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్‌ని జూన్ నుంచి మొద‌లుపెట్ట‌నున్న‌ట్టు తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All