సూపర్స్టార్ మహేష్ నటిస్తున్న తాజా చిత్ర `సరిలేరు నీకెవ్వరు`. అనిల్ రావిపూడి రూపందిస్తున్న ఈ చిత్రం ఈ సంక్రాంతికి సందడి చేయబోతోంది. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకరతో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నారు. సంక్రాంతి సమరం అంటే మహేష్ ఫాదర్ కృష్ణ సినిమాలు ముందుండేవి. ఈ సంప్రదాయాన్ని గత కొన్నేళ్లుగా మహేష్ కంటిన్యూ చేస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి బ్లాక్ బస్టర్ని సొంతం చేసుకోవాలన్న కసితో యాక్షన్కి ఎంటర్టైన్మెంట్ని దేశభక్తిని మిళితం చేసి `సరిలేరు నీకెవ్వరు` చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు.
ఈ సినిమాపై ఫస్ట్ లుక్ రిలీజ్ నుంచే సర్వత్రా అంచనాలు పెరిగిపోయాయి. ఇటీవల విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై అంచనాల్ని మరింత పెంచేసింది. దీంతో సినిమాపై అన్ని ఏరియాల్లోనూ భారీ డిమాండ్ నెలకొంది. అందుకు తగ్గట్టే మేకర్స్ స్క్రీన్స్ని పెంచేస్తున్నారు. ఓవర్సీస్లోనూ భారీ స్థాయిలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఇప్పటికే పాజిటివ్ టాక్తో యమ క్రేజ్ని సొంతం చేసుకున్న ఈ సినిమా ద్వారా లేడీ అమితాబ్ విజయశాంతి రీఎంట్రీ ఇస్తున్నారు.
ఈ 11న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంలో ఓ సర్ప్రైజ్ వుందని దర్శకుడు అనిల్ రావిపూడి చెబుతున్నారు. ఆ సర్ప్రైజ్ మరేంటో కాదు సూపర్స్టార్ కృష్ణ. `సరిలేరు..`లో అయన ఎంట్రీనే సర్ప్రైజింగ్గా వుంటుందని, అదేంటనేది తెరపైనే చూడాలని చెబుతున్నారు. ఇందులో సూపర్స్టార్ అల్లూరి సీతారామరాజు గెటప్లో కనిపిస్తారని, అది మహేష్ ఫ్యాన్స్కి విపరీతంగా నచ్చతుందని, థీయేటర్లలో ఈలలు వేస్తూ గోల చేయడం ఖాయమని దర్శకుడు అనిల్ రావిపూడి కాన్ఫిడెంట్గా చెబుతున్నారు.