యంగ్టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం `ఆర్ ఆర్ ఆర్`. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రామ్చరణ్తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్చరణ్, కొమరం భీం పాత్రతో ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ మూడొంతులు పూర్తయింది. లాక్డౌన్ తరువాత ప్రభుత్వ మార్తదర్శకాలని బట్టి పూనేలో షూటింగ్ చేయాలనుకుంటున్నారు. ఈ షెడ్యూల్లో అలియాభట్ నటించనుంది.
ఇదిలా వుంటే ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే. ఇది ఎన్టీఆర్ నటించనున్న 30వ చిత్రం. ఎస్. రాధాకృష్ణతో కలిసి హీరో కల్యాణ్రామ్ నిర్మించనున్నారు. ఈ చిత్రం సెట్స్పైకి రాకుండానే ఎన్టీఆర్ భారీ ప్లాన్ వేసినట్టు ప్రచారం జరుగుతోంది. `ఆర్ ఆర్ ఆర్` చిత్రం ద్వారా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపుని సొంతం చేసుకోబోతున్నాడు.
దీన్ని దృష్టిలో పెట్టుకుని బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థాయి పిరియాడిక్ చిత్రాన్ని చేయబోతున్నారంటూ ప్రచారం మొదలైంది. బాలీవుడ్లో సంజయ్ లీలా భన్సాలీ చిత్రాలకు ప్రత్యేకత వుంది. అతను చేసే సినిమాల్లో నటించాలని చాలా మంది స్టార్స్ ఆసక్తిని చూపిస్తుంటారు. భారీ సెట్లు, భారీ తారగణం, విన సొంపైన సంగీతం, కంటికి ఇంపుగా కనిపించి కనువిందు చేసే భారీ తనం సంజయ్లీలా భన్సాలీ చిత్రాల ప్రత్యేకత. ఈ స్థాయిలో సినిమాల్ని రూపొందించే దర్శకుడు మరొకరు ఇండియన్ సినిమాల్లో లేరంటే అది అతిశయోక్తికాదు. అలాంటి దర్శకుడితో ఎన్టీఆర్ పిరియాడిక్ సినిమా, అందులోనూ రణ్వీర్సింగ్ విలన్గా నటిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంత అన్నది తెలియాలంటే ఎన్టీఆర్ స్పందించాల్సిందే.