మెగాపవర్స్టార్ రామ్చరణ్, యంగ్టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం `ఆర్ ఆర్ ఆర్`. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటి వరకు మేజర్ పార్ట్ మొత్తం పూర్తి చేసినట్టు చెబుతున్నారు. 75 శాతం చిత్రీకరణ పూర్తియిందని, మరో కీలక షెడ్యూల్ పూనేలో ప్రారంభం కానుందని వార్తలు వినిపించాయి. అక్కడ అలియాభట్ పాల్గొనగా కీలక సన్నివేశాల్ని చిత్రీకరించాలని ప్లాన్ చేశారు.
కరోనా వైరస్ విజృంభిచడంతో షూటింగ్ వాయిదా పడింది. ఇదిలా వుంటే ఈ సినిమా తరువాత కొంత విరామం తీసుకుని మహేష్ తో సినిమా చేస్తానని రాజమౌళి ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని జేమ్స్ బాండ్ తరహాలో తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.
అయితే అందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ఎవరూ ఊహించని కొత్త నేపథ్యంలో సినిమా వుంటుందని, ప్రస్తుతం లాక్డౌన్ నడుస్తున్న నేపథ్యంలో మహేష్ కోసం విజయేంద్ర ప్రసాద్ కథని సిద్ధం చేస్తున్నారని, జానర్ ఏంటనేది స్క్రిప్ట్ పూర్తయితే గానీ క్లారిటీ రాదని తాజాగా వినిపిస్తోంది.