`బాహుబలి` తరువాత రాజమౌళి స్థాయి మారిపోయింది. పాన్ ఇండియా స్థాయి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగు సినిమా స్థాయి రాజమౌళికి ముందు తరువాత అనే స్థాయిలో టాలీవుడ్కు వన్నె తెచ్చారు. ఆయన నుంచి సినిమా వస్తోందంటే యావత్ దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న `ఆర్ ఆర్ ఆర్`పై యావత్ దేశ వ్యాప్తంగా భారీ అంచనాలే నెలకొన్నాయి.
లాక్డౌన్ కారణంగా ఈ చిత్ర షూటింగ్ ఆపేయాల్సి వచ్చింది. ఎప్పుడు లాక్డౌన్ ఎత్తేస్తారో అని చిత్ర యూనిట్ ఎదురుచూస్తోంది. ఇదిలా వుంటే ఓ మీడియాతో ఇంటరాక్ట్ అయిన రాజమౌళి పు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు. దర్శకుడిగా మరో పదేళ్ల వరకు రిటైర్మెంట్ లేదని ప్రకటించారు. రిటీఐర్మెంట్ తరువాత తను, తనకు సంబంధించిన కుటుంబాలు ఎక్కడ వుండబోతున్నాయి అన్నది కూడా వెల్లడించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
రాజమౌళి కుటుంబ సభ్యులు తెలంగాణలోని నల్లగొండ జిల్లా ఈదులూరు గ్రామంలో పొలాలు కొన్నారట. ప్రతి ఆదివారం అక్కడికి రాజమౌళికి సంబంధించిన కుటుంబ సభ్యులంతా వెళతారట. రిటైర్ అయ్యాక, పిల్లలంతా స్థిరపడ్డాక అక్కడికి వెళ్లి వుండాలని ముందే ప్లాన్ చేసుకున్నారట. అక్కడే ఎవరి పొలాల్లో వారు ఫామ్ హౌస్లు నిర్మించుకుని అక్కడే మిగిలిన జీవితాన్ని గడపాలన్నది రాజమౌళి ప్లాన్గా తెలిసింది.