రామ్చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా జక్కన్న తెరకెక్కిస్తున్న చిత్రం `ఆర్ ఆర్ ఆర్`. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ఫ్రీడమ్ ఫైటర్ల పాత్రలని తీసుకుని రాజమౌళి తెరకెక్కిస్తున్న ఫిక్షనల్ మూవీ ఇది. డీవీవీ దానయ్య అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషలతో పాటు 10 భారతీయ ప్రధాన భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.
75 శాతం చిత్రీకరణ పూర్తి చేసిన ఈ చిత్ర షెడ్యూల్ కరోనా కారణంగా ఆగిపోయింది. ఇదిలా వుంటే ఈ సినిమా తరువాత రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని మహేష్తో చేస్తానని వెల్లడించారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై కె.ఎల్. నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే ఏ జానర్లో వుంటుందనే చర్చ మొదలైంది.
విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ అందించనున్నారు. రాజమౌళి సినిమా అంటే కథ విజయేంద్రప్రసాద్, సంగీతం కీరవాణి అన్న విషయం అందరికి తెలిసిందే. ఈ క్వారెంటైన్ వేళ రాజమౌళి ఫ్యామిలీకి కాస్త దూరంగా వుంటున్నవిజయేంద్రప్రసాద్ ప్రస్తుతం మహేష్ చిత్రానికి కథని సిద్ధం చేస్తున్నారట. ఫైనల్ లైన్ ఓకే అయిందని తెలిసింది. సినిమా ప్రధానంగా యాక్షన్ థ్రిల్లర్ జానర్లో వుండబోతోందని తెలిసింది.