Homeటాప్ స్టోరీస్ఆ ఇద్ద‌రు ఇంటి నుంచే చేస్తున్నార‌ట‌!

ఆ ఇద్ద‌రు ఇంటి నుంచే చేస్తున్నార‌ట‌!

ఆ ఇద్ద‌రు ఇంటి నుంచే చేస్తున్నార‌ట‌!
ఆ ఇద్ద‌రు ఇంటి నుంచే చేస్తున్నార‌ట‌!

లాక్ డౌన్ కార‌ణంగా జ‌న జీవితం స్థ‌భించి పోయింది. తాజాగా లాక్ డౌన్ మే 3 వ‌ర‌కు పొడిగించ‌డంతో `ఆర్ ఆర్ ఆర్` లాంటి భారీ చిత్రానికి ఇబ్బందులు త‌లెత్తే అవ‌కాశం వుంద‌ని, ముందు అనుకున్న ప్ర‌కారం ఈ సినిమా జ‌న‌వ‌రి 8న రిలీజ్ కావ‌డం క‌ష్ట‌మ‌నే వార్త‌లు షికారు చేస్తున్నాయి. అయితే ముందుగా ప్ర‌క‌టించిన తేదీనే చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని చిత్ర బృందం ప్లాన్‌ని ఆచ‌ర‌ణ‌లో పెట్టిన‌ట్టు తెలిసింది.

ఈ చిత్రంలో రామ్‌చ‌ర‌ణ్, ఎన్టీఆర్ హీరోలుగా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా, ఎన్టీఆర్ కొమ‌రం భీంగా న‌టిస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన రామ్‌చ‌ర‌ణ్ టీజ‌ర్‌కు మంచి స్పంద‌న ల‌భించింది. అయితే ఈ చిత్రాన్ని అనుకున్న స‌మ‌యానికి రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేసిన జ‌క్క‌న్న ఇప్ప‌టికే పోస్ట్‌ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్‌ని మొద‌లుపెట్టిన‌ట్టు తెలిసింది.

- Advertisement -

రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ఇంటి ప‌ట్టునే వుంటున్నా టెక్నాల‌జీ స‌హ‌కారంలో ఇంట్లోనే త‌మ పాత్ర‌ల‌కు సంబంధించిన డ‌బ్బింగ్‌ని పూర్తి చేస్తున్న‌ట్టు చెబుతున్నారు. ఈ ఇద్ద‌రి స్టార్స్ ఇంట్ఓ మినీ థియేట‌ర్లు వున్నాయి. అందులో డ‌బ్బింగ్ చెప్ప‌డం కోసం వీరికి జ‌క్క‌న్న క్వాలిటీగ‌ల రెండు మైక్‌ల‌ని పంపించిన‌ట్లు తెలిసింది. ఇదే నిజ‌మైతే `ఆర్ ఆర్ ఆర్` జ‌న‌వ‌రి 8న రిలీజ్ కావ‌డం ఖాయ‌మే అంటున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All