`కేజీఎఫ్` చిత్రంతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ టాలీవుడ్ హీరోలకు మరో రాజమౌళిలా మారిపోయారు. ఆయనతో సినిమా చేయాలని చాలా మంది స్టార్ హీరోలు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం `కేజీఎఫ్2`ని పూర్తి చేస్తున్న ప్రశాంత్ నీల్ అదే ఊపులో ప్రభాస్ తో `సలార్` చిత్రాన్ని పట్టాలెక్కించారు. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ని కూడా పూర్తి చేసుకుంది.
ఇదిలా వుంటే ఈ మూవీకి ముందు ప్రారంభం కావాల్సిన ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ చిత్రం మొత్తానికి ఇప్పటికి ఫైనల్ అయినట్టు తెలిసింది. పాన్ ఇండియా స్థాయిలో ఎన్టీఆర్తో ప్రశాంత్ నీల్ ఓ భారీ ప్రాజెక్ట్ని ప్లాన్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ చిత్రాన్ని నిర్మించడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసి ప్రశాంత్ నీల్కు అడ్వాన్స్ కూడా అందజేసిందట.
తాజాగా ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయినట్టు తెలిసింది. ప్రస్తుతం `ఆర్ఆర్ఆర్` చిత్రంలో నటిస్తున్న ఎన్టీఆర్ ఈ మూవీ పూర్తి కాగానే త్రివిక్రమ్ చిత్రాన్ని ప్రారంభించబోతున్నారు. ఇది ఎన్టీఆర్ 30వ చిత్రం దీని తరువాతే ప్రశాంత్ నీల్ చిత్రం ట్రాక్లోకి వస్తుందని తెలిసింది. ఎన్టీఆర్ సత్తాని పూర్తి స్థాయిలో ఆవిష్కరించే సినిమా ఇదని తెలుస్తోంది.