Homeటాప్ స్టోరీస్మహేష్ కాదు చరణ్ నే ఫిక్స్ చేస్తున్నారు!

మహేష్ కాదు చరణ్ నే ఫిక్స్ చేస్తున్నారు!

మహేష్ కాదు చరణ్ నే ఫిక్స్ చేస్తున్నారు!
మహేష్ కాదు చరణ్ నే ఫిక్స్ చేస్తున్నారు!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. ఇటీవలే ఓ సినిమా రిలీజ్ వేడుకలో ఈ విషయాన్ని ధృవీకరించాడు చిరంజీవి. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకుడన్న విషయం తెల్సిందే. మొదట త్రిషను ఈ చిత్రానికి కథానాయికగా అనుకున్నా ముందు చెప్పినట్లు తర్వాత తన పాత్ర లేకపోవడంతో ఆచార్యలో తాను నటించట్లేదు అని నిన్ననే ప్రకటించింది త్రిష. దీంతో నిర్మాతలు ఇప్పుడు వేరే హీరోయిన్ ను సెట్ చేసే పనిలో పడ్డారు.

ఇక ఈ సినిమాలో కీలక పాత్రలో రామ్ చరణ్ నటిస్తాడని మొదట ప్రచారం జరిగింది. అయితే చరణ్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీగా ఉంటాడు కాబట్టి ఈ సినిమాలో నటించడం కుదరదని భావించారు. అందుకే రామ్ చరణ్ స్థానంలో మహేష్ బాబును అనుకున్నారు. కొరటాల శివకు మహేష్ కు దగ్గర సాన్నిహిత్యం ఉంది. అలాగే చిరు అంటే మహేష్ కు ఎనలేని అభిమానం. ఈ నేపథ్యంలో కొరటాల శివ అడగ్గానే మహేష్ సూచనప్రాయంగా ఎస్ చెప్పినట్లు తెలుస్తోంది.

- Advertisement -

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మహేష్ కూడా చరణే నటిస్తాడని అంటున్నారు. చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించడం చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటి మంచి అవకాశాన్ని వదులుకోకూడదని చరణ్ ఫీలయ్యాడట. అందుకే రాజమౌళి దగ్గర ఆచార్య షూటింగ్ కోసం పెర్మిషన్ కూడా తెచుకున్నాడని ఇప్పుడు తాజా న్యూస్ చెబుతోంది. ఇద్దరూ ఒకరి సినిమాలో మరొకరు ఇదివరకు కనిపించినా అది కేవలం ఒక పాట వరకో లేదా ఒక 5 నిమిషాల పాత్ర వరకో పరిమితమైంది. కానీ ఇలా 30 నిమిషాల పాత్ర అంటే అభిమానులకు పండగే కదా. అందుకే చిరంజీవి కూడా ఈ విషయంలో చొరవ చూపించి రాజమౌళితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయం గురించి అధికారిక సమాచారం బయటకు రానుంది. ఆగష్టు 14న ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All