Homeటాప్ స్టోరీస్జిగేల్ రాణి పాట పాడితే పైసా ఇవ్వలేదట

జిగేల్ రాణి పాట పాడితే పైసా ఇవ్వలేదట

no remunaration for jigelu rani singer సంచలన విజయం సాధించిన రంగస్థలం చిత్రంలో ” జిల్ జిల్ జిగేలు రాణి ” అనే ఐటెం సాంగ్ కుర్రాళ్ళ ని ఒక ఊపు ఊపేసింది అయితే ఆ పాట పాడిన ” గంటా వెంకటలక్ష్మి ” కి నయా పైసా కూడా ఇవ్వలేదట ! దాంతో తన బాధని మీడియా ముందు వెళ్లబోసుకుంది ఈ గాయని . దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించిన విషయం తెలిసిందే . అయితే జిగేల్ రాణి పాట ని పాడటానికి ఇక్కడి నుండి చెన్నై కి తన డబ్బులే పెట్టుకొని మరీ వెళ్లి పాడిందట ! దేవిశ్రీ ప్రసాద్ ని కలవడానికి ఈ గాయని ఎంత ప్రయత్నించినా కుదరలేదట !

మధ్యవర్తి ద్వారా వెళ్లిన ఈ గాయనికి మంచి పేరు వచ్చింది కానీ డబ్బులు మాత్రం ఇవ్వలేదు , అయితే మధ్యవర్తి డబ్బులు తీసుకున్నాడని నాకు నయా పైసా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది . కష్టపడింది నేను కానీ డబ్బులు ఎవరో తీసుకోవడం ఏంటి ? అని ప్రశ్నిస్తోంది . అయినా పాట పాడిన గాయని కి కాకుండా మధ్యవర్తి కి డబ్బులు ఎలా ఇచ్చారో ఏంటో ? దేవిశ్రీ ప్రసాద్ కానీ రంగస్థలం చిత్ర యూనిట్ కానీ సమాధానం చెప్పాల్సి ఉంది . ఇక ఇదే సినిమాలో మరో గాయకుడు కూడా దేవిశ్రీ ప్రసాద్ పై దర్శకులు సుకుమార్ పై అరోపణలు చేసాడు . ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టు కెళతావా అనే పాట పాడింది శివనాగులు ఆడియో లో కూడా ఆ పాట ఉంది పాపులర్ అయ్యింది కూడా కానీ సినిమాలో మాత్రం దేవిశ్రీ పాడిన పాట ఉంటుంది దాంతో నా గొంతు నొక్కేశారు అంటూ మీడియా ముందుకు వచ్చాడు శివనాగులు .

- Advertisement -

English Title: no remunaration for jigelu rani singer

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All