Homeటాప్ స్టోరీస్సాయి ప‌ల్ల‌వి ప్లేస్‌లో నిత్యామీన‌న్‌?

సాయి ప‌ల్ల‌వి ప్లేస్‌లో నిత్యామీన‌న్‌?

సాయి ప‌ల్ల‌వి ప్లేస్‌లో నిత్యామీన‌న్‌?
సాయి ప‌ల్ల‌వి ప్లేస్‌లో నిత్యామీన‌న్‌?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్, రానా తొలిసారి క‌లిసి ఓ మ‌ల్టీస్టార‌ర్ చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాగ‌ర్ కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని మల‌యాళ హిట్ ఫిల్మ్  `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` ఆధారంగా తెర‌కెక్కిస్తున్నారు. ఇటీవ‌లే చిత్రీక‌ర‌ణ మొద‌లైంది.

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్, రానా పాల్గొన‌గా ప‌లు కీల‌క ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రించారు. ఇందులో ప‌వ‌న్‌, రానా మ‌ధ్య యాక్ష‌న్ సీన్స్‌ని కూడా అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో వేసిన ప్ర‌త్యేక సెట్‌లో చిత్రీక‌రించారు. బుల్లెట్‌పై ప‌వ‌న్ పాల్గొన్న దృశ్యాల‌కు సంబంధించిన ఫొటోలు, వీడియో ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో సంద‌డి చేశాయి. ఇదిలా వుంటే ఈ చిత్రంలో హీరోయిన్ లుగా సాయి ప‌ల్ల‌వి, ఐశ్వ‌ర్యా రాజేష్ అని చిత్ర బృందం ఎంపిక చేసింది. అయితే ఇందులో ఐశ్వ‌ర్యా రాజేష్ ఫైన‌ల్ అయినా సాయి ప‌ల్ల‌వి మాత్రం ఇంకా ఫైన‌ల్ కాలేదు.

- Advertisement -

‌ప‌వ‌న్‌కు జోడీగా సాయి ప‌ల్ల‌విని తీసుకోవాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేశారు. కానీ డేట్స్ స‌మ‌స్య కార‌ణంగా సాయి ప‌ల్ల‌వి ఈ ప్రాజెక్ట్‌లో న‌టించ‌డానికి ఆస‌క్తిని చూపించ‌లేద‌ట‌. దీంతో ఆమె స్థాన్ంలో నిత్యామీన‌న్‌ని మేక‌ర్స్ ఫైన‌ల్ చేశార‌ట‌. అయితే నిత్య ఈ ప్రాజెక్ట్‌లో న‌టించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ప్ప‌టికీ డేట్స్ ని బ‌ట్టి ఫైన‌ల్ నిర్ణ‌యం వెల్ల‌డిస్తాన‌ని చెప్పిన‌ట్టు తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All