Homeటాప్ స్టోరీస్నితిన్ రిస్క్ చేసి మంచి పనే చేశాడా?

నితిన్ రిస్క్ చేసి మంచి పనే చేశాడా?

నితిన్ రిస్క్ చేసి మంచి పనే చేశాడా?
నితిన్ రిస్క్ చేసి మంచి పనే చేశాడా?

యంగ్ హీరో నితిన్ ఇప్పుడు రిస్క్ చేసి మంచి పనే చేసాడు అంటున్నారు విశ్లేషకులు. ఒక్కోసారి అయ్యో ఎందుకిలా అయ్యిందా అని అనుకుంటాం కానీ ఏది జరిగినా మన మంచికే అనే సామెత ఊరికే పెట్టలేదనిపిస్తుంది. నితిన్ భీష్మ విషయంలో మరోసారి ఇది ప్రూవ్ అయింది కూడా. నితిన్ నటించిన లేటెస్ట్ సినిమా భీష్మను ఫిబ్రవరి వంటి డల్ సీజన్ లో విడుదల చేసినప్పుడు అందరూ నితిన్ ది రాంగ్ స్టెప్ అని అభిప్రాయపడ్డారు. కంటెంట్ బాగున్నా కానీ డల్ సీజన్ లో విడుదలైన కారణంగా భీష్మ రేంజ్ పెరగకుండా పోయిందన్నది విశ్లేషకుల భావన.

హిట్ కంటెంట్ ఉన్న భీష్మ 26 కోట్లకు కొంచెం అటుగా కలెక్ట్ చేసి ఆగిపోయింది. అదే మరో నెలో, రెండు నెలలో ఆగి రిలీజ్ చేసి ఉన్నట్లయితే భీష్మకు సమ్మర్ సెలవులు కలిసొచ్చేవి అన్నది వారి భావన. కానీ ఇప్పుడు నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే నితిన్ అండ్ కో చేసింది మంచి పనే అనిపిస్తుంది.

- Advertisement -

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా థియేటర్లు మూసివేసిన సంగతి తెల్సిందే. దాంతో విడుదలలకు సిద్ధంగా ఉన్న సినిమాలు మొత్తం విడుదల కాకుండా ఆగిపోయాయి. నాని నటించిన వి ఉగాదికి రిలీజ్ అనుకుంటే ఇప్పుడు ఏప్రిల్ కు మారింది. ఏప్రిల్ సినిమాల పరిస్థితి ఇంకా అగమ్యగోచరంగా ఉంది. అదే భీష్మ విషయంలో నిర్మాతలు అత్యాశకు పోయి తర్వాత మంచి సీజన్ చూసి విడుదల చేసుకుందాం అనుకుని ఉండుంటే మార్చ్ లో సినిమాల వాయిదా, పోనీ ఏప్రిల్ అనుకుంటే ఇంకా దాని గురించి ఏం చెప్పలేని పరిస్థితి.

మార్చ్ 25 నుండి ప్రతీ వారం ఏప్రిల్ చివరి వరకూ సినిమా రిలీజ్ లు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు అవన్నీ తారుమారు అవ్వనున్నాయి. రిలీజ్ స్లాట్ ల కోసం మిగతా నిర్మాతలతో పేచీ తప్పదు. ఈ తలనొప్పులు ఏవీ లేకుండా నితిన్ ఒక హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అందుకే అంటారు ఏం జరిగినా మన మంచికే అని.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All