వంశీ పైడిపల్లి సినిమా స్థానంలో పరశురామ్ చిత్రాన్ని ఓకే చేసిన మహేష్బాబు త్వరలో సెట్స్పైకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. పరశురామ్ చెప్పిన లైన్ సింపుల్గా, కొత్తగా వుండంతో మైత్రీ మూవీమేకర్స బ్యానర్లో చేయడానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చిన హీరో మహేష్ ఈ చిత్రాన్ని జూన్ లేదా జూలైలో పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఇప్పటికే పరశురామ్ ఈ స్క్రిప్ట్కు దుదిమెరుగులు దిద్దేపనిలో వున్నాడట.
ఇదిలా వుంటే మహేష్ కొత్త దర్శకులు, యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్లతో వర్క్ చేయడానికి, తనతో వర్క్ చేయాలని, మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నయంగ్ డైరెక్టర్ల కథలు వినడానికి మహేష్ అండ్ టీమ్ వెల్కమ్ చెబుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెస్లోనే పరశురామ్ని స్టోరీని ఓకే చేసి ఆశ్చర్యపరిచిన ప్రిన్స్ తాజాగా మరో యంగ్ డైరెక్టర్ చెప్పిన కథకు ఇంప్రెస్ అయ్యారని తెలిసింది. ఛలో, భీష్మ వంటి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లని సొంతం చేసుకున్న యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల.
తాజాగా మహేష్కు ఓ ఎక్స్లెంట్ స్క్రిప్ట్ని నరేట్ చేశారట. వెంకీ చెప్పిన స్టైల్, స్టోరీ లైన్ నచ్చిన మహేష్ వెంటినే ఈ లైన్ని డెవలప్ చెయ్ మనం చేద్దామని వెంకీకి ఆఫర్ ఇచ్చారట. ప్రస్తుతం ఈ లైన్ని పూర్తి స్థాయి స్క్రిప్ట్గా మార్చేపనిలో వెంకీ కుడుముల బిజీ అయిపోయారని తెలిసింది. మహేష్కి వెంకీ సిద్ధం చేస్తున్న స్క్రిప్ట్ నచ్చితే సినిమా పట్టాలెక్కడం ఇక లాంఛనమే. అదే జరిగితే యంగ్ టాలెంటెడ్ వెంకీ కుడుముల దశ తిరిగినట్టే అని టాలీవుడ్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. రీసెంట్గా వెంకీ కుడుముల `భీష్మ` చిత్రంతో బ్రిలియంట్ హిట్ని సొంతం చేసుకున్నారు.