నితిన్ హీరోగా నటించిన తాజా చిత్రం `భీష్మ`. వెంకీ కుడుముల రూపొందించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలై తొలి షోతోనే మంచి టాక్ని సొంతం చేసుకుంది. లక్కీ ఛార్మగా పేరు పడ్డ రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ప్రీ రిలీజ్ బిజినెస్ కారణంగా దాదాపు 9 కోట్ల ప్రాఫిట్ని సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించే అవకాశం వుందని తెలుస్తోంది. సంక్రాంతి చిత్రాల సందడి సద్దుమనగడంతో థియేటర్ల వద్ద హడావిడి తగ్గింది. `భీష్మ` కు తొలి షోకే పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్లన్నీ సందడిగా మారాయి.
అనకున్న విజయం దక్కడంతో `భీష్మ` టీమ్ సంబరాల్లో మునిగితేలుతోంది. సక్సెస్ గురించి తెలుసుకున్న టీమ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఆఫీస్లో బ్లాక్ బస్టర్ హిట్ కేక్ని కట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు వెంకీ కుడుముల, నిర్మాత సూర్యదేవర నాగవంశీ, హీరోయిన్ రష్మిక పాల్గొన్నారు. దర్శకుడు వెంకీ కుడుముల బ్లాక్ బస్టర్ హిట్ కేక్ని కట్ చేశారు.
#BlockbusterBheeshma Celebrations ?? @actor_nithiin @iamRashmika @VenkyKudumula @mahathi_sagar @saisriram_dop @sahisuresh @vamsi84 @SVR4446 @adityamusic @SitharaEnts pic.twitter.com/xBZYs0WiD6
— L.VENUGOPAL,Journalist/P.R.O?? (@venupro) February 21, 2020
Credit: Twitter