Homeటాప్ స్టోరీస్యంగ్ దర్శకులతో ఠీవిగా నితిన్

యంగ్ దర్శకులతో ఠీవిగా నితిన్

యంగ్ దర్శకులతో ఠీవిగా నితిన్
యంగ్ దర్శకులతో ఠీవిగా నితిన్

యంగ్ హీరో నితిన్ ఇప్పుడు విజయానందంలో తేలిపోతున్నాడు. తన రీసెంట్ సినిమా భీష్మకు కలెక్షన్ల వెల్లువ వస్తుండడమే దీనికి కారణం. భీష్మ చిత్రానికి మొదటి ఆట అయ్యింది మొదలు సూపర్ హిట్ రెస్పాన్స్ రావడం మొదలైంది. సెకండ్ వీకెండ్ లో కూడా భీష్మ స్ట్రాంగ్ గా ఉంది. ఒకవైపు తన తదుపరి చిత్రాల షూటింగ్ లతో బిజీగా ఉంటూనే నితిన్ భీష్మ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. రీసెంట్ గా నితిన్ తన దర్శకులతో దిగిన ఫోటో మంచి ఫీల్ ను ఇచ్చింది. భీష్మ దర్శకుడు వెంకీ కుడుముల, రంగ్ దే దర్శకుడు వెంకీ అట్లూరి, అంధధూన్ రీమేక్ దర్శకుడు మేర్లపాక గాంధీ, పవర్ పేట దర్శకుడు కృష్ణ చైతన్యలతో కలిసి నితిన్ ఫోటోను దిగి తన ఆనందాన్ని పంచుకున్నాడు.

వరసగా మూడు ప్లాపుల తర్వాత వచ్చిన విజయం కావడంతో నితిన్ కు భీష్మ సక్సెస్ మరింత స్పెషల్ గా మారింది. అ.. ఆ తర్వాత నితిన్ కు విజయం లేదు. వరసగా లై, చల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం సినిమాలు బోల్తా కొట్టాయి. అయినా కూడా నితిన్ మార్కెట్ చెక్కుచెదరకపోవడం విశేషం. ఈ చిత్రం 25 కోట్ల క్లబ్ లో స్థానం సంపాదించింది. అయినా ప్లాపులు నితిన్ కు కొత్తేమి కాదు.

- Advertisement -

వరసగా 12 సినిమాల ప్లాప్ తర్వాత ఇష్క్ తో కంబ్యాక్ ఇచ్చాడు నితిన్. అలాంటిది ఇప్పుడు మూడు సినిమాల ప్లాప్ పెద్ద లెక్క ఏముంది. ఈ ఏడాది భీష్మ ఇప్పటికే విడుదలైపోగా మరో రెండు సినిమాలను కూడా దించనున్నాడు. ఇప్పటికే రంగ్ దే దాదాపు సగం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ సినిమాను సమ్మర్ కు విడుదల చేయనున్నాడు. ఇక ఫొటోలో లేని సీనియర్ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చెక్ అనే చిత్ర షూటింగ్ ను కూడా మొదలుపెట్టాడు నితిన్. ఈ సినిమా కూడా ఈ ఏడాదే విడుదల కానుంది. ఇక సమ్మర్ అవ్వగానే అంధధూన్ రీమేక్ ను మొదలుపెట్టనున్న నితిన్, పవర్ పేట సంగతి వచ్చే ఏడాది చూస్తాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All