యూత్ స్టార్ నితిన్ ప్రస్తుతం మూడు చిత్రాలు చేస్తున్నాడు. అవి షూటింగులో ఉండగానే నాలుగో చిత్రం కమిట్ అయ్యాడని వార్తలు వస్తున్నాయి.. అ ఆ తరువాత చేసిన లై, చల్ మోహన రంగ, శ్రీనివాస కల్యాణం చిత్రాలు అట్టర్ ప్లాప్ అవడంతో నితిన్ ఇప్పుడు సరైన హిట్ కోసం ఆచి తూచి అడుగేస్తూ వరుస సినిమాలను కమిట్ అయి చేస్తున్నాడు.
సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లో వెంకీ కుడుములు దర్శకత్వంలో భీష్మ, అలాగే వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే‘ చిత్రాలు చేసున్నాడు నితిన్. ఈ రెండు చిత్రాలను ఎస్.నాగవంశీ నిర్మిస్తున్నారు. మరో పక్క చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో వి.ఆనంద్ ప్రసాద్ రూపొందించే సినిమా కూడా నితిన్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ఇప్పుడు నాలుగో చిత్రం కూడా కమిట్ అయ్యారని తెలిసింది. హిందీలో బ్లాక్ బస్టర్ అయిన ‘అంధాదున్‘ చిత్రాన్ని ఓ ప్రముఖ నిర్మాత రీమేక్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రీమేక్లో నితిన్ అయితే పర్ఫెక్ట్ గా సూట్ అవుతారని సదరు నిర్మాత భావిస్తున్నట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.
హీరోగా నటించిన ఆయుష్మాన్ ఖురాన కి నేషనల్ అవార్డు కూడా వచ్చిన ఈ చిత్రం యంగ్ హీరోస్ కి ఎవరికైనా సెట్ అవుతుంది. మరి ఈ చిత్రంలో నితిన్ నటిస్తాడా? లేక మరి వేరే హీరో నటిస్తాడో తెలియాల్సి వుంది..!!