Homeటాప్ స్టోరీస్నిఖిల్ ఎందుకింత సైలెంట్ అయిపోయాడు!!

నిఖిల్ ఎందుకింత సైలెంట్ అయిపోయాడు!!

నిఖిల్ ఎందుకింత సైలెంట్ అయిపోయాడు!!
నిఖిల్ ఎందుకింత సైలెంట్ అయిపోయాడు!!

యంగ్ హీరో నిఖిల్ అర్జున్ సురవరం సినిమాతో తన ప్లాపులకు బ్రేకులు వేసుకున్నాడు. ఈ సినిమా చాలా సార్లు వాయిదా పడి 2019లో ఎట్టకేలకు విడుదలైంది. అయితే అనూహ్యంగా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుని నిఖిల్ కెరీర్ కు కొత్త ఊపిరిలూదింది. అయితే మంచి విజయం వచ్చిన తర్వాత ఏ హీరో అయినా సినిమాల పరంగా దూసుకెళ్తాడు.

నిఖిల్ కూడా మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. అయితే వాటిని పట్టాలెక్కించే విషయంలో మాత్రం లేట్ అవుతుండడం నిఖిల్ ఫ్యాన్స్ ను ఇబ్బంది పెడుతోంది. ప్రస్తుతం 18 పేజెస్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు నిఖిల్. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకుని ప్రస్తుతం బ్రేక్ లో ఉంది.

- Advertisement -

ఇక కార్తికేయ 2 గత రెండు సంవత్సరాలుగా ప్రొడక్షన్ కు సిద్ధమవుతూనే ఉంది. ఈ ఏడాది చిత్రీకరణ ప్రారంభిస్తారని చెప్పినా అది ఇంత వరకూ జరగలేదు. ఇక ఏషియన్ సినిమాస్ బ్యానర్ లో నిఖిల్ హీరోగా ఒక సినిమా అనౌన్స్ అయింది. ఆ దర్శకుడు, ఇతర సాంకేతిక నిపుణులు విషయంలో ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.

నిఖిల్ ఎందుకని తన నెక్స్ట్ సినిమా విషయాల్లో ఇంత స్లో అండ్ సైలెంట్ గా ఉంటున్నాడు అనేది తెలియాల్సి ఉంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All