యంగ్ హీరో నిఖిల్ స్పీడు పెంచారు. చందూ మొండేటి దర్శకత్వంలో హిట్ ఫిల్మ్ `కార్తికేయ`కు సీక్వెల్ చేస్తూనే దానికి సమాంతరంగా మరిన్ని చిత్రాల్ని లైన్లో పెడుతున్నారు. `కార్తికేయ -2` చిత్రంతో నటిస్తున్న నిఖిల్ ఈ మూవీతో పాటు `18 పేజెస్` చిత్రంలో నటిస్తున్నారు. `కుమారి 21ఎఫ్` ఫేమ్ పల్నాటి సూర్యప్రతాప్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో నిఖిల్కి జోడీగా మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వనన్ని ఫైనల్ చేశారు. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇందులో నటించడం చాలా ఎగ్జైటింగ్గా వుందని హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ట్వీట్ చేసింది.
స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ ప్రాజెక్ట్కి యాడ్ కావడంతో ఈ చిత్రంపై ప్రత్యేక దృష్టిపడింది. ప్రీ ప్రొడక్షన్ దశలో వున్న ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. మరో విశేషం ఏంటంటే ఈ మూవీతో పాటు అనుపమ పరమేశ్వరన్ `కార్తికేయ 2` లోనూ నటించనుందని తెలిసింది. అంటే నిఖిల్తో అనుపమ బ్యాక్ టు బ్యాక్ హిట్లని అందించబోతోందన్న మాట.