`అర్జున్ సురవరం` సక్సెస్… ప్రేమించిన అమ్మాయితో పెళ్లి.. ఇలా వరుస శుభాలతో యంగ్ హీరో నిఖిల్ కెరీర్ మాంచి జోషమీదుంది. ఇటీవలే `కార్తికేయ2` చిత్రాన్ని తిరుపతిలో స్వామివారి సన్నిధిలో మొదలుపెట్టిన నిఖిల్ తాజాగా మరో చిత్రాన్ని సెట్స్పైకి తీసుకురాబోతున్నాడు. జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్పై అల్లు అరవింద్ సమర్పణలో నిఖిల్ ఓ సినిమా చేయబోతున్నాడు.
`కుమారి 21ఎఫ్` ఫేమ్ సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిచబోతున్నాడు. బన్నీవాసు నిర్మించనున్న ఈ చిత్రం ఈ నెల 6న లాంఛనంగా ప్రారంభం కాబోతోంది. ఉదయం 9గంటలకు ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. ఇదే టైమ్కు చిత్ర టైటిల్ని కూడా ప్రకటించబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం బుధవారం మీడియాకు ప్రకటించింది.
దర్శకుడు సుకుమార్ ఓ భాగస్వామిగా వ్యవహరిస్తూనే స్క్రీన్ప్లే అందిస్తున్న ఈ చిత్రంలో హీరో నిఖిల్ పాత్ర చాలా కొత్తగా వుంటుందని, ఆందులో నటించే హీరోయిన్తో పాటు మిగతా నటీనటుల వివరాల్ని చిత్ర బృందం ఈ నెల 6నే ప్రకటించే అవకాశం వుందని తెలిసింది.