Homeటాప్ స్టోరీస్`కార్తికేయ -2`కు ముహూర్తం ఫిక్స్ అయింది!

`కార్తికేయ -2`కు ముహూర్తం ఫిక్స్ అయింది!

`కార్తికేయ -2`కు ముహూర్తం ఫిక్స్ అయింది!
`కార్తికేయ -2`కు ముహూర్తం ఫిక్స్ అయింది!

`అర్జున్ సుర‌వ‌రం` వంటి హిట్ చిత్రం త‌రువాత నిఖిల్ ఏ సినిమా చేయ‌బోతున్నాడ‌ని అంద‌రిలో ఆస‌క్తి మొద‌లైంది. కొత్త త‌ర‌హా చిత్రాల్ని మాత్ర‌మే ఎంచుకుంటూ వ‌రుస విజ‌యాల్ని సొంతం చేసుకుంటున్నారు నిఖిల్‌. `అర్జున్ సుర‌వ‌రం` త‌రువాత ఆయ‌న క్రేజీ సీక్వెల్‌లో న‌టించ‌బోతున్నారు. నిఖిల్ హీరోగా న‌టించిన చిత్రం `కార్తికేయ‌`. చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం 2014 అక్టోబ‌ర్ 24న విడుద‌లై అనూహ్య విజ‌యాన్ని సాధించింది. హీరోగా నిఖిల్ కెరీర్‌ని మ‌లుపు తిప్పింది.

క‌ల‌ర్స్ స్వాతి హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో ఎనిమ‌ల్ హిప్నాటిజ‌మ్ అనే కొత్త పాయింట్‌ని తీసుకుని సుబ్ర‌మ‌ణ్య‌స్వామి గుడి నేప‌థ్యంలో మిస్ట‌రీని ఛేదించే ఓ యువ‌కుడి క‌థ‌గా చందూ మొండేటి తెర‌కెక్కించిన ఈ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ కు సీక్వెల్‌ని చేయాల‌ని గ‌త కొంత కాలంగా చందూ మొండేటి ప్లాన్స్ చేస్తూ వ‌స్తున్నారు. అది ఇప్ప‌టికి కుదిరింది. నిఖిల్ హీరోగా న‌టించ‌నున్న ఈ సీక్వెల్‌ని పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌ బ్యాన‌ర్స్‌పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా నిర్మించ‌బోతున్నారు.

- Advertisement -

వివేక్ కూచీభోట్ల స‌హ‌నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్న ఈ చిత్రం మార్చి 2న తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో లాంఛ‌నంగా ప్రారంభం కాబోతోంది. `కార్తికేయ 2` పేరుతో ఈ చిత్రాన్ని తెర‌పైకి తీసుకొస్తున్నారు. ఈ ద‌ఫా దేవ వ్యాప్తంగా వున్న మిస్టీరియ‌స్ టెంపుల్స్ నేప‌థ్యంలో అత్యంత భారీ స్థాయిలో హైటెక్న‌క‌ల్ వాల్యూస్‌తో ఈ చిత్రం రూపొంద‌నుందని చిత్ర బృందం వెల్ల‌డించింది. కాగా ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివ‌రిలోనే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నార‌ట‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All