నిఖిల్ హీరోగా 2014లో వచ్చిన చిత్రం `కార్తికేయ`. కుమార స్వామి టెంపుల్ నేపథ్యంలో ఆద్యందం ఆసక్తికరంగా తెరకెక్కిన ఈ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. నిఖిల్ కెరీర్కి మరింత బూస్టప్ నిచ్చింది. మళ్లీ ఇన్నేళ్ల తదరువాత ఈ చిత్రానికి సీక్వెల్ని తీస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ సైలెంట్గా మొదలైంది. ఈ సారి కొత్త లొకేషన్, కొత్త నేపథ్యాన్ని ఈ చిత్రం కోసం దర్శకుడు చందు మొండేటి ఎంచుకున్నారు.
తొలి భాగం సుబ్రహ్మణ్యస్వామి నేపథ్యంలో సాగితే సీక్వెల్ ద్వారక నేపథ్యంలో సాగబోతోంది. వందల ఏళ్ల క్రితం ద్వారకా నగరం నదిలో మునిగిపోయిన విషయం తెలిసిందే. దాని వెనక దాగివున్న చాత్రక రహస్యాల్ని ఈ చిత్రంలో చెప్పబోతున్నారట. నిఖిల్ మార్కెట్కు మించి ఈ చిత్రం కోసం భారీ బడ్జెట్నే ఖర్చు చేస్తున్నారు. ఇండియాలోని కీలక ఆలయాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది. ఇప్పటికే ప్రారంభమైన ఈ చిత్రాన్ని హైదరాబాద్ 5 డేస్, వైజాగ్ 25 డేస్, వియత్నాం, కంబోడియాలోని వరల్డ్ ఫేమస్ టెంపుల్, నార్త్ ఇండియాలో టోటల్ 70 డేస్ షూట్ చేయబోతున్నారు.
నిఖిల్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో రాబోతున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వైనాట్ స్టూడియోస్ తమిళ్లో రిలీజ్ చేయబోతోంది. ఇందులో నిఖిల్కు జోడీగా ఇస్మార్ట్ గాళ్ నభా నటేష్ నటిస్తున్నట్టు తెలిసింది.