Homeటాప్ స్టోరీస్ఏడుకొండ‌ల‌వాడి సాక్షిగా నిఖిల్ `కార్తికేయ 2` షురూ!

ఏడుకొండ‌ల‌వాడి సాక్షిగా నిఖిల్ `కార్తికేయ 2` షురూ!

ఏడుకొండ‌ల‌వాడి సాక్షిగా నిఖిల్ `కార్తికేయ 2` షురూ!
ఏడుకొండ‌ల‌వాడి సాక్షిగా నిఖిల్ `కార్తికేయ 2` షురూ!

నిఖిల్ హీరోగా 2014లో వ‌చ్చిన చిత్రం `కార్తికేయ‌`. చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించిన హీరో నిఖిల్ కెరీర్‌లోనే అత్యధిక వ‌సూళ్ల‌ని సాధించిన చిత్రంగా నిలిచింది. ఓ పాముని హిప్నాటైజ్ చేయ‌డం అనే కాన్సెప్‌తో ఆద్యంత ఆస‌క్తిక‌రంగా రూపొందిన చిత్రానికి సీక్వెల్‌గా `కార్తికేయ 2`ని చిత్ర బృందం సోమ‌వారం (ఈ రోజు) ఏడుకొండ‌ల‌వాడి సాక్షిగా తిరుప‌తిలో స్వామివారి స‌న్నిధిలో ప్రారంభించింది.

నిఖిల్ హీరోగా చందూ మొండేటి రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తొలుత ఉద‌యం స్వామివారిని ద‌ర్శించుకున్న చిత్ర బృందం అనంత‌రం స్వామివారి కొండ‌పై పూజా కార్య‌క్ర‌మాల‌తో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. `ఆ క‌లియుగ దైవం తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర‌స్వామి స‌న్నిధిలో ముహూర్తం షాట్‌. కెమెరా స్విఛాన్ చేసిన భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి గారికి ధ‌న్య‌వాదాలు` అని హీరో నిఖిల్ ట్వీట్ చేశారు.

- Advertisement -

కార్తికేయ చిత్రాన్ని సుబ్ర‌మ‌ణ్య‌స్వామి టెంపుల్‌లో దాగివున్న ర‌హ‌స్యం నేప‌థ్యంలో తెర‌కెక్కిస్తే సీక్వెల్‌ని మాత్రం దేశ వ్యాప్తంగా వున్న ప్ర‌ధాన గుళ్ల నేప‌థ్యంలో ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించ‌బోతున్నారు. కొత్త త‌ర‌హా క‌థ‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి కీర‌వాణి త‌న‌యుడు కాళ‌భైర‌వ సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All