కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా పెరిగిపోతోంది. పాజిటివ్ కేసుల సంక్ష కూడా గణనీయంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ని మే 3 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. దీని కారణంగా చాలా మంది ఫంక్షన్స్ వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పటికే ఇద్దరు తెలుఉ హీరోలు నిఖిల్, నితిన్ తమ వెడ్డింగ్స్ని వాయిదా వేసుకున్నారు. అయితే కన్నడ హీరో నిఖిల్ గౌడ మాత్రం తన వెడ్డింగ్ని వాయిదా వేసుకోవడానికి ఇష్టపడటం లేదు.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి గౌడ తనయుడు, హీరో నిఖిల్ గౌడ వివాహం కన్నడ పొలిటికల్ లీడర్ రేవన్న కుమార్తె రేవతితో జరగనున్న విషయం తెలిసిందే. ఇటీవలే గ్రాండ్గా ఎంగేజ్మెంట్ జరిగింది. వివాహాన్ని ఏప్రిల్ 17న శుక్రవారం జరపాలని ముహూర్తం నిర్ణయించారు. అయితే కరోనా కారణంగా వివాహాలని రద్దు చేసుకోవాలని, అధిక సంఖ్యలో జనాలని సమీకరించరాదని ఆంక్షలు వుండటంతో నిఖిల్ వివాహం వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా వున్నాయని అంతా భావించారు.
కానీ పెళ్లి విషయంలో రాజీపడటానికి ఇష్టపడని కుమారస్వామి ఫ్యామిలీ తన కొడుకు నిఖిల్ వివాహాన్ని ఫామ్ హౌస్లో నిర్వహించాల నిర్ణయించుకుంది. ఈ రోజు ఉదయం బెంగళూరుతోని ఫామ్ హౌస్లో 7:30 గంటల నుంచే పెళ్లి పనుల్ని ప్రారంభించింది. మంగళ స్నానాల కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఉదయం 9:30 గంటలకు వివాహా తంతుని పూర్తి చేయబోతున్నారు. ఈ కార్యక్రమంలో 60 నుంచి 70 మంది కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొంటున్నారట. వివాహానంతరం ఉదయం 12 గంటలకు నిఖిల్ కుటుంబం ఫామ్ హౌస్ నుంచి ఇంటికి చేరుకుంటారట.