మెగా పవర్స్టార్ రామ్చరణ్, యంగ్టైగర్ ఎన్టీఆర్ తొలిసారి కలిసి నటిస్తున్న ఫిక్షనల్ పిరియాడిక్ డ్రామా `ఆర్ ఆర్ ఆర్`. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ మూవీపై దేశ వ్యాప్తంగానే కాకుండా వరల్డ్ వైడ్గా భారీ అంచనాలు నెలకొన్నాయి. లాక్డౌన్ సమయంలో రామ్చరణ్ పుట్టిన రోజు సందర్భంగా అల్లూరి సీతారామరాజు లుక్కి సంబంధించిన టీజర్ని రిలీజ్ చేసి సర్ప్రైజ్ చేసిన జక్కన్న ఆ తరువాత ఎన్టీఆర్ టీజర్ని బర్త్డేకి రిలీజ్ చేస్తానంటూ ప్రకటించారు. కానీ కరోనా కారణంగా కుదరలేదు.
తాజాగా గోండు ముద్దు బిడ్డ కొమరం భీం జయంతి సందర్భంగా ఎన్టీఆర్కు సంబంధించిన భీమ్ టీజర్ని రిలీజ్ చేశారు. టీజర్లోని ప్రతీ సన్నివేశాన్ని రోమాంచితంగా చిత్రీకరించిన తీరు, విజువల్స్ ఓ వండర్ లా వున్నాయి. ఉవ్వెత్తున ఎగిసే అల.. భల్లున పేలే అగ్ని పర్వతం ఈ టీజర్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అయితే ఈవే ఇప్పుడు జక్కన్నని అడ్డంగా బుక్కయ్యేలా చేశాయి.
నేషనల్ జియాగ్రఫీ ఛానల్ డాక్యుమెంటరీలోని ఓల్కనో సీన్ని యాజిటీజ్గా లేపేశారు. దీన్నే నెటిజన్స్ పాయింట్ అవుట్ చేస్తూ ట్రోల్ చేయడం చర్చనీయాంశంగా మారింది. వర్షంలో నీటి బిందులు రాలే విజువల్స్… ఇవన్నీ రాజమౌళి నేరుగా షూట్ చేసిన సన్నివేశాలు కాదు నేషనల్ జియాగ్రఫీ ఛానల్ డాక్యుమెంటరీ నుంచి సేకరించినవే. దీంతో ఆయనపై విమర్శలు మొదలయ్యాయి. ఇక్కడో విషయం చెప్పాలి. ఈ సన్నివేశాల్ని సదరు ఛానల్ నుంచి రాజమౌళి టీమ్ భారీ భారీ మొత్తం చెల్లించి తీసుకుందట. అందుకే వాటిని టీజర్లో వాడుకుందని చెబుతున్నారు. మరి దీనిపై రాజమౌళి ఏమంటారో చూడాలి.