Homeటాప్ స్టోరీస్రాజమౌళిని రామాయణం తీయమంటున్నారే?

రాజమౌళిని రామాయణం తీయమంటున్నారే?

రాజమౌళిని రామాయణం తీయమంటున్నారే?
రాజమౌళిని రామాయణం తీయమంటున్నారే?

ఇప్పుడున్న పరిస్థితులకు బడ్జెట్ పరంగా విజువల్ ఎఫెక్ట్స్ పరంగా భారీ సినిమాలకు న్యాయం చేయగలిగిన దర్సకులు ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తే అందరికీ మదిలో మెదిలే పేరు ఎస్ ఎస్ రాజమౌళి. ఆయన ఎంచుకున్న బడ్జెట్ కు, విజువల్ ఎఫెక్ట్స్ కు న్యాయం చేయగలిగేది ఒక్క రాజమౌళే అన్నది అందరి భావన. జక్కన్న ఎంత ఖర్చు పెట్టించినా దానికి కొన్ని రెట్ల లాభాలు తీసుకురాగలడన్నది నిర్మాతల, డిస్ట్రిబ్యూటర్ల భరోసా. అందుకే రాజమౌళి ఏది అడిగినా మారు మాట్లాడకుండా నిర్మాత సమకూరుస్తాడు. బాహుబలి వంటి భారతదేశం గర్వించే సినిమా తీసిన రాజమౌళి ఇప్పుడు రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో ఆర్ ఆర్ ఆర్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెల్సిందే.

అయితే ఇప్పుడు ఉన్నట్లుండి సోషల్ మీడియాలో అందరూ రాజమౌళిని రామాయణం తీయమని అడుగుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. డిడి ఛానల్ ప్రస్తుతం రామాయణం సీరియల్ ను మళ్ళీ ప్రసారం చేస్తోన్న విషయం తెల్సిందే. దీనికి ప్రపంచంలోనే అత్యధిక రేటింగ్స్ వస్తున్నాయి. అందరూ రామాయణం సీరియల్ ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. దీని వల్ల మళ్ళీ డిడి చాలా ఏళ్ల తర్వాత టాప్ పోసిషన్ కు చేరుకుంది.

- Advertisement -

రామాయణం టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పటి సాంకేతికత, బడ్జెట్ ను ఆసరాగా చేసుకుని రామాయణాన్ని రాజమౌళి తెరకెక్కిస్తే అదిరిపోతుందన్న భావన అందరిలోనూ కలుగుతోంది. అందుకే సోషల్ మీడియా #RajamouliMakeRamayan అనే హ్యాష్ ట్యాగ్ ను తెగ ట్రెండ్ చేస్తున్నారు. రాజమౌళికి మహాభారతం తీయాలన్నది డ్రీమ్. ఒకవేళ తీస్తే అదే తన చివరి ప్రాజెక్ట్ అవ్వొచ్చని కూడా వెల్లడించాడు జక్కన్న. రామాయణం కన్నా మహాభారతంలో డ్రామా ఎక్కువ ఉందని తను ఫీలవుతాడు. అయితే మహాభారతం తెరకెక్కించడం మాములు విషయం కాదని, దానికి ప్రస్తుతం తనకున్న అనుభవం సరిపోదని తెలిపాడు. మరి ప్రజల కోరిక మేరకు జక్కన్న మహాభారతం కన్నా ముందు రామాయణం తీసే విషయంలో ఏదైనా ఆలోచన చేస్తాడా అన్నది చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All