న్యాచురల్ స్టార్ నాని తిరిగి ముఖానికి రంగు వేసుకుంటున్నాడు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగులకు దూరమైన నాని తిరిగి బిజీ అయ్యాడు. నాని నటిస్తోన్న శ్యామ్ సింగ రాయ్ షూటింగ్ మొదలైంది. ఇది ఫైనల్ షెడ్యూల్ అని నాని అధికారికంగా తెలియజేసాడు. “శ్యామ్ వచ్చేసాడు. ఆఖరి షెడ్యూల్ మొదలైంది” అని నాని ట్వీట్ చేసాడు.
10 ఎకరాలలో శ్యామ్ సింగ రాయ్ కోసం లాక్ డౌన్ కు ముందు భారీ సెట్ వేశారు. ఆ తర్వాత హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాలకు ఈ సెట్ కొంత మేర దెబ్బతింది. ఇప్పుడు ఈ సెట్ కు మరమత్తులు చేయడంతో లాస్ట్ షెడ్యూల్ మొదలైంది.
రాహుల్ సంకిట్ర్యాన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నాడు. నాని కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
View this post on Instagram