నాని, సుధీర్బాబు హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం `వి`. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కెరియర్లో నాని తొలిసారి నెగెటివ్ షేడ్స్ వున్న పాత్రలో నటిస్తున్నారు. నివేదా థామస్, అదితీరావు హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటివల విడుదల చేసిన ఈ చిత్ర టీజర్, ట్రైలర్లు సినిమాపై భారీ ఇంపాక్ట్ని కలిగించాయి.
అయితే సినిమాకు కరోనా వైరస్ కారణంగా ఓవర్సీస్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం వుందని తెలుస్తోంది. ఈ నెల 25న చిత్రాన్ని వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. 24 రాత్రి ప్రీమియర్ షోలని ఏర్పాటు చేశారట. అయితే కరోనా ఎఫెక్ట్ కారణంగా ఓవర్సీస్లో సినిమాల కోసం థియేటర్లకు వచ్చేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపించడం లేదట. దీని కారణంగానే ఈ సినిమా రిలీజ్ని మరో వారం పాటు అయినా పోస్ట్ పోన్ చేయాలని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాత దిల్ రాజుని కోరినట్టు తెలిసింది.
తాజా పరిణామాల నేపథ్యంలో ఈ చిత్ర రిలీజ్ వాయిదా పడే అవకాశాలు వున్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే నిర్మాత దిల్ రాజు మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ చిత్రాన్ని అనుకున్న డేట్కే రిలీజ్ చేయాలనుకుంటున్నామని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లకు వెల్లడించినట్టు తెలిసింది. దీంతో ముందు ఒప్పందం చేసుకున్న అమౌంట్ రంటే తక్కువ మొత్తానికి ఈ చిత్రాన్ని ఓవర్సీస్ డిస్ట్రి బ్యూటర్స్ కోట్ చేసినట్టు ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తోంది.