కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా ఓటీటీలకు మంచి ఆదరణ మొదలైంది. దీంతో చాలా మంది ఓటీటీల బాట పడుతున్నారు. ఇప్పటికే దక్షిణాదిలో పలు ఓటీటీ ప్లాట్ ఫామ్లు మొదలయ్యాయి. తెలుగులో తొలిసారిగా `ఆహా` ఓటీటీ మొదలైన విషయం తెలిసిందే. దక్షిణాదిలో అతి పెద్ద ఓటీటీగా పేరు తెచ్చుకుంటోంది కూడా. వర్మ కూడా ఆర్జీవీ వలల్డ్ థీయేటర్ పేరుతో ఓటీటీని ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఇదిలా వుంటే హాట్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నమిత తన పేరుతో `నమిత థియేటర్` పేరుతో సొంతంగా ఓటీటీ రంగంలోకి ఎంట్రీ ఇస్తోంది. `సొంతం` సినిమాతో నమిత తెలుగు ప్రేక్షకులకు పరిచయమై నటిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది. ఆ తరువాత తమిళంలోకి ప్రవేశించి అక్కడా గుర్తింపుని తెచ్చుకుంది.
తాజాగా ఆమె తన సొంత ఓటీటీ ప్లాట్ఫామ్ను `నమిత థియేటర్` పేరుతో ప్రారంభించి డిజిటల్ రంగంలోకి ప్రవేశిస్తుండటం విశేషం. దీని గురించి నమిత బుధవారం అధికారికంగా ప్రకటించింది.
సాఫ్ట్వేర్ ఇంజనీర్ రవివర్మ సహకారంతో నమిత ఈ కొత్త OTT ప్లాట్ఫామ్ను ప్రారంభిస్తోంది. నటి తన OTT ప్లాట్ఫామ్ ద్వారా నిజమైన సంఘటనల ఆధారంగా రూపొందిన చిన్న కథలు, సినిమాలను ప్రదర్శించాలనుకుంటోంది.