కరోనా సెకండ్ వేవ్ దేశ వ్యాప్తంగా విలయాన్ని సృష్టిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో శవాలని కాల్చడానికి స్మశానాలు ఖాలీ లేవంటూ బోర్డులు కూడా తగిలిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో త్వరలో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమల్లోకి రావచ్చంటూ ఊహగానాలు వస్తున్నాయి. దీంతో అన్ని రంగాలు అప్పమత్తమవుతున్నాయి.
ఇందులో భాగంగా సినీ రంగం కూడా జాగ్రత్తపడుతోంది. ఈ నెల మామూలుగా వుంటే తమ చిత్రాలని రిలీజ్ చేసుకోవాలని చాలా మంది నిర్మాతలు, స్టార్ హీరోలు రిలీజ్ డేట్లని ప్రకటించారు. కోవిడ్ సెకండ్ వేవ్ ఉదృతం అవుతున్న నేపథ్యంలో తమ చిత్రాల రిలీజ్లని వాయిదా వేస్తున్నారు. తాజాగా మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న మూవీని కూడా పోస్ట్ పోన్ చేశారు.
`క్రాక్` బ్లాక్ బస్టర్తో మళ్లీ ట్రాక్లోకి వచ్చిన రవితేజ ఈ మూవీ ఇచ్చిన సక్సెస్ కారణంగా రెట్టించిన ఉత్సాహంతో యాక్షన్ థ్రిల్లర్ `ఖిలాడీ`ని పట్టాలెక్కించారు. రమేష్ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ మూవీ రిలీజ్ని వాయిదా వేశారు. ముందు ఈ మూవీని ఈ నెల 28న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో
ఈ మూవీ రిలీజ్ని వాయిదా వేస్తున్నట్టు చిత్ర బృందం బుధవారం అధికారికంగా ప్రకటించింది.
Keeping the current #Covid19 Pandemic in mind,Mass Maharaja @RaviTeja_offl‘s #Khiladi has been postponed! ????
A New Release Date will be announced soon. @DirRameshVarma @ThisIsDSP @DimpleHayathi @Meenachau6 @sagar_singer @idhavish #AStudiosLLP @PenMovies @KHILADiOffl @adityamusic pic.twitter.com/TINxBuwGMU— BARaju (@baraju_SuperHit) May 5, 2021