అక్కినేని నాగార్జున ప్రస్తుతం అహిషోర్ సాల్మన్ దర్శకుడిగా పరిచయం అవుతున్న `వైల్డ్ డాగ్` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. 2009లో హైదరాబాద్లో జరిగిన వరుస బ్లాస్టింగ్ల నేపథ్యంలో అత్యంత రియలిస్టిక్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ భామలు దియా మీర్జా, సయామీఖేర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కరోనా వైరస్ కారనంగా ఈ చిత్ర థాయ్లాండ్ ఎపిసోడ్ని వాయిదా వేశారు. తాజా షెడ్యూల్ని పరిస్థితులని బట్టి ప్రారంభిస్తారట.
ఇదిలా వుంటే ఈ ఏడాది నాగ్ మనో చిత్రాన్ని మొదలుపెట్టబోతున్నారు. అది ఓ హిట్ సినిమాకి సీక్వెల్. 2016లో వచ్చిన రొమాంటిక్ థ్రిల్లర్ `సోగ్గాడే చిన్నినాయనా`. ఈ చిత్రానికి సీక్వెల్గా `బంగార్రాజు` అనే పేరుతో ఓ చిత్రాన్నితెరపైకి తీసుకురావాలని గత కొన్నేళ్లుగా నాగ్ ప్లాన్ చేస్తున్నారు. కానీ కథలో క్లారిటీ రాకపోవడంతో ఇన్నాళ్లు స్క్రిప్ట్ కోసం ఎదురుచూశారు. ఫైనల్లీ స్క్రిప్ట్ లాక్ అయింది. త్వరలోనే సీక్వెల్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు.
తొలి భాగంలో నటించిన రమ్యకృష్ణ సీక్వెల్లో అదే పాత్రలో కనిపించనుందట. నాగచైతన్య కూడా ఇందులో కనిపించనున్నాడని గత కొన్ని నెలలుగా వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో చై ఈ విషయాన్ని ఇండైరెక్ట్గా వెల్లడించారు కూడా. జూన్లో లాంఛనంగా ప్రారంభించి జనవరి 15కి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది నాగార్జున ప్లాన్గా తెలుస్తోంది. అయితే సంక్రాంతి బరిలో `ఆర్ ఆర్ ఆర్` రాబోతున్న విషయం తెలిసిందే. మరి అ పోటీని నాగ్ తట్టుకుంటాడా? మరి.