యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో `లవ్ స్టోరీ` చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం `ఫిదా` తరహాలో మ్యాజిక్ చేయడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా కారణంగా 15 రోజుల షూటింగ్ బ్యాలెన్స్గా వున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ని సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభించి చిత్రాన్ని డిసెంబర్ లేదా సంక్రాంతి బరిలోకి దింపాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.
ఇదిలా వుంటే ఈ సినిమా తరువాత నాగచైతన్య మరో చిత్రాన్ని అంగీకరించారు. `థ్యాంక్యూ` పేరుతో రూపొందనున్న ఈ చిత్రానికి `మనం` ఫేమ్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించబోతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు, శిరీష్, హర్షిత్రెడ్డి సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ రోజు అక్కినేని నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించింది.
హీరో నాగార్జునకు విషెస్ అందజేస్తూనే ఈ చిత్ర టైటిల్ లోగోని విడుదల చేసింది. నాగచైతన్య నటిస్తున్న 20వ చిత్రమిది. ఈ చిత్రంపై గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఆ వార్తల్ని నిజం చేస్తూ చిత్ర బృందం అధికారికంగా ఈ సినిమాపై క్లారిటీ ఇచ్చేసింది. ఇప్పటి వరకు చూడని స్లైల్లో నాగచైతన్యను ప్రజెంట్ చేసేలా సినిమా ఉంటుందని, చైతూ, విక్రమ్ కాంబినేషన్లో వచ్చిన క్లాసిక్ `మనం` గురించి అందరికి తెలిసిందే. ఇప్పుడు అదే కాంబోలో సినిమా చేస్తుండటం ఆనందంగా వుందని, త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి మరిన్ని వివరాల్ని వెల్లడిస్తామని నిర్మాతలు తెలిపారు. దిల్ రాజు, శిరీష్, హర్షిత్రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు బివిఎస్ రవి, స్క్రీన్ప్లే దర్శకత్వం విక్రహ్ కె. కుమార్.