సెన్సిబుల్ కథలకు కేరాఫ్ అడ్రస్ అయిన శేఖర్ కమ్ముల ప్రస్తుతం నాగ చైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా ఒక చిత్రాన్ని మొదలుపెట్టిన సంగతి తెల్సిందే. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ మొదలవ్వగా, అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ ను కూడా పూర్తి చేశారట. ఈ షెడ్యూల్ లో ఒక పాటతో పాటు హీరోహీరోయిన్ల మధ్య కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కూడా జరిగిందిట. జెట్ స్పీడుతో ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని అనుకుంటున్నాడు శేఖర్ కమ్ముల.
అన్నీ అనుకున్నట్లు జరిగితే క్రిస్మస్ బరిలోకి, లేదంటే సంక్రాంతి పోటీలోకి ఈ చిత్రాన్ని దింపాలని ఆలోచిస్తున్నారు. ఏషియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ చిత్రం ద్వారా నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతోంది. నారాయణదాస్ నారంగ్, ఎఫ్.డి.సి చైర్మైన్ రామ్మోహనరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల నుండి రానున్న చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.