Homeటాప్ స్టోరీస్ప్రాజెక్ట్ కె పై మరోసారి క్లారిటీ ఇచ్చిన నాగ్ అశ్విన్

ప్రాజెక్ట్ కె పై మరోసారి క్లారిటీ ఇచ్చిన నాగ్ అశ్విన్

ప్రాజెక్ట్ కె పై మరోసారి క్లారిటీ ఇచ్చిన నాగ్ అశ్విన్
ప్రాజెక్ట్ కె పై మరోసారి క్లారిటీ ఇచ్చిన నాగ్ అశ్విన్

మహానటి వంటి చిత్రంతో నేషనల్ అవార్డును అందుకున్న నాగ్ అశ్విన్ తన తర్వాతి చిత్రాన్ని ప్రభాస్ హీరోగా ప్రకటించేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అని నాగ్ అశ్విన్ రివీల్ చేసాడు. తనకు ప్రీ ప్రొడక్షన్ కు చాలా సమయం కావాలని నాగ్ అశ్విన్ అడగడంతో ప్రభాస్ సరేనని ఈ గ్యాప్ లో సలార్, ఆది పురుష్ చిత్రాలను లైన్లో పెట్టాడు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాల షూటింగ్స్ సమాంతరంగా జరుగుతున్నాయి.

ప్రాజెక్ట్ కె విషయానికొస్తే అమితాబ్ బచ్చన్, ప్రభాస్ కాంబినేషన్ లో చిన్న షెడ్యూల్ జరిగింది. ఆది పురుష్ ను పూర్తి చేసిన తర్వాత ప్రాజెక్ట్ కె కు డేట్స్ ఇవ్వనున్నాడు ప్రభాస్. ఇదిలా ఉంటే అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు కావడంతో ప్రాజెక్ట్ కె కు సంబంధించిన అప్డేట్ వస్తుందని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.

- Advertisement -

అయితే నాగ్ అశ్విన్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ప్రాజెక్ట్ కె నుండి అప్డేట్స్ ఇవ్వడానికి ఇంకా సమయముంది. ఇప్పుడే ఏం ఇవ్వలేం. రాధే శ్యామ్ విడుదలయ్యాక ప్రాజెక్ట్ కె అప్డేట్స్ మొదలవుతాయి అని తెలిపాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటిస్తోంది. దాదాపు 400 కోట్ల రూపాయల బడ్జెట్ ను ఈ చిత్రం కోసం అలాట్ చేసారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All