ఎం.ఎస్. రాజుకు సమ్మర్ హిట్ చిత్రాల నిర్మాతగా మంచి పేరుండేది. `పౌర్ణమి` తరువాత ఆయన ఫేటే మారిపోయింది. `వాన` ఆయన కెరీర్ని మరింత ప్రమాదంలోకి నెట్టేసింది. ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న ఆయన కొంత విరామం తరువాత మళ్లీ మెగా ఫోన్ పట్టారు. తన పంథాకు పూర్తి భిన్నంగా `డర్టీ హరీ` పేరుతో ఓ మాస్ మసాలా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇదొక ఎరోటిక్ థ్రిల్లర్. చి:ల:సౌ, హిట్ చిత్రాల ఫేమ్ రుహానీ శర్మ ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. శ్రవణ్రెడ్డి హీరోగా పరిచయం అవుతున్నారు. గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ మొత్తం పూర్తయింది. అడల్ట్ డ్రామాగా ఎం.ఎస్. రాజు తెరకెక్కించిన ఈ చిత్రం నేటి యువతని టార్గెట్ చేస్తూ నిర్మించారు.
కరోనా కారణంగా థియేటర్లు మూసివేయడంతో చిన్న సినిమాలన్నీ ఓటీటీల్లో రిలీజ్ అవుతున్నాయి. ఇటీవల విడుదలైన చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుండటంతో ఎం.ఎస్. రాజు కూడా `డర్టీ హరి`ని డైరెక్ట్ ఓటీటీ ప్లాట్ ఫాంలో రిలీజ్ చేయాలనుకుంటున్నారట. ఇప్పటికే రేటు విషయంలో చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఈ చిత్రాన్ని ఓ పేరున్న ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది.