Homeటాప్ స్టోరీస్రాజ‌మౌళిని ఫాలో అవుతున్న మ‌ణిర‌త్నం!

రాజ‌మౌళిని ఫాలో అవుతున్న మ‌ణిర‌త్నం!

రాజ‌మౌళిని ఫాలో అవుతున్న మ‌ణిర‌త్నం!
రాజ‌మౌళిని ఫాలో అవుతున్న మ‌ణిర‌త్నం!

ద‌ర్శ‌క‌డు రాజ‌మౌళి `బాహుబ‌లి` చిత్రంతో తెలుగులో కొత్త ట్రెండ్‌ని సెట్ చేశారు. రెండు భాగాలుగా తెర‌కెక్కిన ఈ చిత్రం తెలుగు సినిమా ముఖ్యంగా భార‌తీయ సినిమా స‌త్తా ఏంటో నిరూపించింది. మార్కెట్ స్థాయిని పెంచి స‌రికొత్త ఒర‌వ‌డికి నాంది ప‌లికి ఎంతో మంది మేక‌ర్స్‌కి ధైర్యాన్ని అందించింది. గ‌త కొన్నేళ్లు భారీ చిత్రాల్ని తెర‌పైకి తీసుకురావాల‌ని ఆలోచిస్తున్న మేక‌ర్స్‌కి స్ఫూర్తిగా నిలిచింది. ‌

భారీ బ‌డ్జెట్‌తో పిరియాడిక్‌, సోషియో ఫాంట‌‌సీల‌ని రెండు భాగాలుగా నిర్మించ‌వ‌చ్చిన ఈ సినిమాతో రాజ‌మౌళి నిరూపించాడు. ప్ర‌స్తుతం ఇదే ఫార్మాలాని బాలీవుడ్ చిత్రం `బ్ర‌హ్మాస్త్ర‌`కు ఫాలో అవుతున్నారు. అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఇదే త‌ర‌హాలో మ‌ణిర‌త్నం చేస్తున్న త‌మిళ చిత్రం `పొన్నియిన్ సెల్వ‌న్‌` చిత్రాన్ని కూడా రెండు భాగాలుగా తెర‌పైకి తీసుకురాబోతున్నార‌ట‌.

- Advertisement -

మ‌ణిర‌త్నం, ఆయ‌న సతీమ‌ణి, న‌టి సుహాసిని ఇన్‌స్టా వేదిక‌గా అభిమానుల‌తో లైవ్ ఛాట్ చేశారు. ప‌లువురు తార‌లు మ‌ణిర‌త్నంని ప్ర‌శ్న‌ల‌తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఈ సంద‌ర్భంగా ఓ నెటిజ‌న్ అడిగిన ప్ర‌శ్న‌కు మ‌ణిర‌త్నం స‌మాధానం చెబుతూ `పొన్నియిన్ సెల్వ‌న్‌`ని రెండు భాగాలుగా రూపొందించ‌బోతున్నాన‌ని, ప్ర‌స్తుతం స్క్రిప్ట్ రాస్తున్నాన‌ని వెల్ల‌డించడంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All