దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం `ఆర్ ఆర్ ఆర్`. రామ్చరణ్, ఎన్టీఆర్ తొలిసారి కలిసి నటిస్తున్నారు. సినిమా ప్రకటించిన దగ్గరి నుంచి దేశ వ్యాప్తంగా వరుస లీకులతో సంచలనం సృష్టిస్తోంది. రామ్చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీంగా కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కోసం బాహుబలి తరహాలో హేవీ గ్రాఫిక్స్ని చేయించబోతున్నారు.
ముఖ్యంగా ఎన్టీఆర్ రియల్ పులితో చేసిన ఫైట్ ని మరింత గ్రాండీయర్గా చూపించబోతున్నారట. ఈ ఫైట్ని ఇటీవలే షూట్ చేశారు. దానికి సంబంధించిన ఓ పిక్ బయటికి రావడంతో ఈ విషయం బయటికి వచ్చింది. అయితే ఈ ఫైట్ కోసం యంగ్ టైగర్ నిజంగా టైగర్ జోన్లోకి వెళ్లి లైఫ్ రిస్క్ చేసినట్టు ఫిల్మ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. సినిమాలో ఈ ఫైట్ రోమాంచితంగా వుంటుందని. ఈ సినిమాకు ప్రధాన హైలైట్గా కూడా ఈ సీన్ నిలుస్తుందని తెలుస్తోంది.
టైగర్ జోన్లో సీన్ అనే సరికి టీమ్ అంతా ముందు కంగారుపడ్డారట. ఆ తరువాత ఎన్టీఆర్ జోష్ చూసి కొన్ని జాగ్రత్తలు తీసుకుని సీన్ని చేసినట్టు తెలుస్తోంది. ఇద్దరు టాప్ స్టార్లు కలిసి నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 8న రిలీజ్ చేస్తున్నారు.