Homeగాసిప్స్కన్నప్ప నుండి తప్పుకున్న భరణి, విష్ణు ఏం చేస్తాడు?

కన్నప్ప నుండి తప్పుకున్న భరణి, విష్ణు ఏం చేస్తాడు?

కన్నప్ప నుండి తప్పుకున్న భరణి, విష్ణు ఏం చేస్తాడు?
కన్నప్ప నుండి తప్పుకున్న భరణి, విష్ణు ఏం చేస్తాడు?

కృష్ణంరాజు హీరోగా వచ్చిన గొప్ప భక్తిరసా చిత్రం భక్త కన్నప్ప. కృష్ణం రాజు కెరీర్ లోనే చాలా ప్రత్యేకమైన చిత్రంగా భక్త కన్నప్ప గురించి చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమాను నేటి సాంకేతిక ఉపయోగించి ఈ తరం ప్రేక్షకులకు సరికొత్తగా చెప్పాలనే ఉద్దేశంతో కృష్ణంరాజు తనికెళ్ళ భరణి ఈ చిత్ర రీమేక్ పై అప్పట్లో చాలా ఉత్సాహం చూపించారు. ప్రభాస్ ను హీరోగా పెట్టి కృష్ణం రాజు ఈ సినిమాను చేయాలనుకున్నాడు. అయితే ప్రభాస్ ఈ సినిమా చేయడానికి ఆసక్తి చూపించలేదు. ఈ నేపథ్యంలో భక్త కన్నప్ప ప్రాజెక్ట్ మంచు విష్ణు చేతుల్లోకి వెళ్ళింది.

మంచు విష్ణు ఈ ప్రాజెక్ట్ పట్ల ఆసక్తి ప్రదర్శించాడు. మూడేళ్ళ క్రితం తనికెళ్ళ భరణి మంచు విష్ణు హీరోగా తాను భక్త కన్నప్ప చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు ప్రకటించాడు. కట్ చేస్తే ఇప్పటికీ ఈ సినిమాపై ఎటువంటి అప్డేట్ లేదు. ఎందుకని? అసలు ఈ చిత్రం ఉంటుందా? అంటే మంచు విష్ణు వాటికి సమాధానమిచ్చాడు.

- Advertisement -

కచ్చితంగా భక్త కన్నప్ప చేస్తానని, అయితే తనికెళ్ళ భరణి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోడని తెలిపాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులలో భాగంగా హాలీవుడ్ నుండి స్టోరీ బోర్డ్ ఆర్టిస్టులను రప్పించి యానిమాట్రిక్స్ చేయించాలనుకున్నాం. అయితే వాటిని చూసి భరణి అంకుల్ ఇంత భారీ చిత్రాన్ని తాను హ్యాండిల్ చేయలేనని, ఏదో చిన్న బడ్జెట్ లో కళాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించగలను అని చెప్పి తప్పుకున్నాడని మంచు విష్ణు తెలిపాడు.

అయితే తాను భక్త కన్నప్ప కోసం 95 కోట్ల రూపాయల బడ్జెట్అనుకుంటున్నట్లు అయితే దాన్ని ఎలా తగ్గించాలా అని ఆలోచిస్తున్నట్లు తెలిపాడు. అలాగే ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని ముగ్గురు అగ్ర దర్శకులను సంప్రదిస్తే బడ్జెట్ లో 30 శాతం రెమ్యునరేషన్ కింద అడిగారు. అందుకే దర్శకుడ్ని కూడా హాలీవుడ్ నుండే రప్పిస్తున్నాం. హాలీవుడ్ లో స్క్రిప్ట్ పూర్తయ్యాక సాయి మాధవ్ బుర్రా తెలుగుకు తగ్గట్లుగా దానికి మార్పులు చేస్తారు అని ప్రకటించాడు. మొత్తానికి భక్త కన్నప్ప విషయంలో మంచు విష్ణు ఆలోచనలు భారీగానే ఉన్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All