ఆచారి అమెరికా యాత్ర, ఓటర్ వంటి వరుస ఫ్లాప్ల తరువాత మంచు విష్ణు నటిస్తున్న చిత్రం `మోసగాళ్లు`. హాలీవుడ్ స్థాయిలో ఆంగ్లో ఇండియన్ సినిమాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మంచు విష్ణు హీరోగా నటిస్తున్నఈ చిత్రంలో చందమామ కాజల్ అగర్వాల్, బాలీవుడ్ నటుడు సునీల్శెట్టి. నవదీప్, నవీన్చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రపంచాన్ని డిజిటల్ మనీ వైపు అడుగుతు వేసేలా చేసి చర్చనీయాంశంగా మారిన బిట్ కాయిన్ ఆన్లైన్ మోసాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీన్ గీచిన్ దర్శకత్వం వహిస్తున్నారు. గత కొంత కాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న మంచు విష్ణు ఈ సినిమాతో ఎలాగైనా మళ్లీ ఫామ్లోని రావాలని ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కీలక ఘట్టాల్ని లాస్ ఏంజిల్స్లో చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్లో హీరో మంచు విష్ణు పాల్గొంటున్నారు. ఆయనపై హాలీవుడ్ ఫైట్ మాస్టర్ నేతృత్వంలో ఈ యాక్షన్ ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు.
ఈ షెడ్యూల్ 10 రోజుల పాటు జరగనుందట. ఆ మధ్య సైలెంట్గా మొదలైన ఈ చిత్ర షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. హాలీవుడ్ చిత్రాల స్థాయి టేకింగ్తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఐటీ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓ ఘరానా మోసం నేపథ్యంలో ఈ సినిమా ఆద్యం అడ్వెచరస్గా సాగనుంది. కాగా ఈ చిత్రంలోని మంచు విష్ణు ఫస్ట్ లుక్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఇందులో నేను మంఇ వాడినా చెడ్డ వాడినా జడ్జి మీరే` అని మంచు విష్ణు ఓ పోస్ట్ని పెట్టారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.