Homeటాప్ స్టోరీస్యూరోప్ చెక్కేసిన ప్రభాస్ అండ్ కో

యూరోప్ చెక్కేసిన ప్రభాస్ అండ్ కో

యూరోప్ చెక్కేసిన ప్రభాస్ అండ్ కో
యూరోప్ చెక్కేసిన ప్రభాస్ అండ్ కో

రెబెల్ స్టార్ ప్రభాస్ తన షూటింగ్ స్పీడ్ ను పెంచేసాడు. బాహుబలి దగ్గరనుండి సినిమాల షూటింగ్ ను నెమ్మదిగా కానిస్తున్న ప్రభాస్ ఇప్పుడు తన 20వ సినిమా విషయంలో పద్దతిని మార్చాడు. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. ఇటీవలే హైదరాబాద్ లో రెండు స్పెషల్ సెట్స్ లో షెడ్యూల్స్ ను పూర్తి చేసిన ప్రభాస్ ఇప్పుడు ఎక్కువ బ్రేక్ తీసుకోకుండా యూరోప్ పయనమయ్యాడు.

ఇటీవలే ప్రభాస్, పూజ హెగ్డేలపై బోట్ సీన్ నేపథ్యంలో సన్నివేశాలను చిత్రీకరించారు. తర్వాత ఒక ట్రైన్ ఎపిసోడ్ ను కూడా షూట్ చేసారు. ఇప్పుడు యూరోప్ లో కొన్ని కీలక సన్నివేశాలను మరియు రెండు పాటలను చిత్రీకరిస్తారని సమాచారం. ఈ సినిమాకు రాధే శ్యామ్ కానీ ఓ డియర్ కానీ టైటిల్ గా అనుకుంటున్నారు. ఈ నెలలోనే టైటిల్ ఏంటనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశముంది. జూన్ కల్లా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేయాలని ప్రభాస్ తన టీమ్ కు ఆర్డర్ వేసినట్లుగా తెలుస్తోంది. ఎలాగైనా దసరా రిలీజ్ ను మిస్ అవ్వకూడదని ప్రభాస్ భావిస్తున్నాడు.

- Advertisement -

దసరాకు ఈ సినిమాను విడుదల చేసేస్తే డిసెంబర్ నుండి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ను మొదలుపెట్టాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమా ఒక పీరియాడిక్ లవ్ స్టోరీ. దీనికి జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్ మరియు గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

ప్రస్తుతం యూరోప్ లో ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ప్రభలిస్తోంది. అయినా కానీ తగిన జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ ను కానిచేద్దామని ప్రభాద్ అండ్ కో డిసైడ్ అయ్యారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ అమ్మగా మాజీ నటి భాగ్యశ్రీ నటిస్తుండడం విశేషం. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. సాహోతో ప్లాప్ అందుకున్న ప్రభాస్ మరి ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All