మన కోసం ఇల్లు, పిల్లల్ని పక్కన పెట్టి జీవితాల్ని పణంగా పెట్టి మన కోసం శ్రమిస్తున్న డాక్టర్లకు, నర్స్లకు, పోలీస్ డిపార్ట్మెంట్ అహర్నిశలు వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. వారికి సంఘీభావంగా ఆదివారం మన కరతాళ ధ్వనులతో వారికి అండగా నిలుద్దాం, వారిని అభినందిద్దాం అని భారత ప్రధాని మోదీ ఇటీవల పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
అయితే కొంత మంది అత్యుత్సాహాన్ని ప్రదర్శించి వీధుల్లో ర్యాలీగా తిరుగుతూ గంటలు, ప్లేట్లు పట్టుకుని వీధుల్లో తిరగడం కనిపించింది. దీనిపై చాలా మందే విమర్శలు చేశారు. ఇంటి ముందు లేదా బాల్కనీల్లో మాత్రమే ఉండి చప్పట్లు కొట్టాలని, గంటలు మోగించాలని మన ప్రధాని మోదీ సూచించారు. కానీ అందుకు భిన్నంగా వీధుల్లోకి రావడం బాగా లేదని కొంత మంది విమర్శలు చేశారు.
తాజాగా మరోసారి ఆదివారం మన మంతా ఒకటే అంటూ మన ఐక్యతను చాటేందుకు ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు జ్యోతి వెలిగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆహేతు హిమాచలం మొత్తం పాల్గొంది. అయితే కొంత మంది ఆకతాయిలు పటాసులు పేల్చడంతో ఓ బిల్డింగ్పై పెద్ద ఎత్తున మంటలు ఆవహించాయి. ఈ వీడియోని సోషల్ మీడియాలో చూసిన హీరో మంచు మనోజ్ దానికి కారకులైన వారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చదువుకున్న ముర్ఖులే ఇలాంటి పనికి పూనుకుని ఉంటారని, ఇప్పటికైనా మనుషుల్లా ప్రవర్తించండని మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశరు.