మంచు మనోజ్ కొంత విరామం తరువాత మళ్లీ సినిమాలు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఆయన నటిస్తున్న తాజా చిత్రం `అహం బ్రహ్మస్మి`. శ్రీకాంత్ ఎన్. రెడ్డి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ శుక్రవారం ఈ మూవీ లాంఛనంగా మెగా హీరో రామ్చరణ్ క్లాప్తో మొదలైంది. ఐదు భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రియ భవాని శంకర్ కథానాయిక. మంచు మనోజ్ శివ భక్తుడిగా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. అయితే అది ఎలాంటి పాత్ర అన్నది మాత్రం ఇంకా స్పష్టతనివ్వలేదు.
ఈ నెల 11న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని మేలో 35 రోజుల పాటు కీలక యాక్షన్ సన్నివేశాల్ని చిత్రీకరిస్తారట. జూన్ 6 నటికి పూర్తి చేస్తారట. అంటే కేవలం 90 రోజుల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేయబోతున్నారన్న మాట. పాన్ ఇండియా సినిమా ఏంటీ కేవలం 90 రోజుల్లో పూర్తి కావడం ఏంటనేది పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
గ్రాఫిక్స్ ప్రధానంగా త్రీ డైమెన్షన్స్ వున్న పాత్రలో మంచు మనోజ్ నటిస్తున్నచిత్రమిది. ఇదొక క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ అని, చాలా థ్రిల్లింగ్ అంశాలుంటాయని దర్శకుడు చెబుతున్నారు. ఈ ఏడాది చివర్లో చిత్రాన్నిరిలీజ్ చేస్తారట. అంటే జూన్ నుంచిగ్రాఫిక్స్ వర్క్ మొదలవుతుందన్న మాట. ఈ సినిమాతో అయినా మంచు మనోజ్ హిట్ బాటపడతారో చూడాలి.