Homeటాప్ స్టోరీస్విక్ర‌మ సింహపురి రాజా వారు!

విక్ర‌మ సింహపురి రాజా వారు!

విక్ర‌మ సింహపురి రాజా వారు!
విక్ర‌మ సింహపురి రాజా వారు!

11 చిన్నారి ఇప్పుడు రాక్ స్టార్ అయ్యాడు. ఆయ‌నే మంచు మ‌నోజ్‌. ప్ర‌భాక‌ర‌రెడ్డి నిర్మించిన `గృహ‌ల‌క్ష్మి` సినిమాతో త‌న సినీ ప్ర‌స్థానం మొద‌లైంది. ఇందులో మోహ‌న్‌బాబు, జ‌య‌సుధ హీరో హీరోయిన్‌లుగా న‌టించారు. ఆ త‌రువాత పున్య‌భూమి నాదేశం, మేజ‌ర్ చంద్ర‌కాంత్ వంటి చిత్రాల్లో బాల‌న‌టుడిగా త‌న స‌త్తా చాటారు. కొంత విరామం త‌రువాత `అహం బ్ర‌హ్మ‌స్మి` చిత్రంతో మ‌ళ్లీ న‌టించ‌డం మొద‌లుపెట్టారు. నేడు మంచు మ‌నోజ్ పుట్టిన రోజు.

యూఎస్‌లో చ‌దువు పూర్తి చేసి ఇండియా వ‌చ్చిన మ‌నోజ్ శానం నాగ అశోక్ కుమార్ నిర్మించిన `దొంగ దొంగ‌తి` చిత్రంతో హీరోగా తెరంగేట్రం చేశారు. 2004లో విడుద‌లైన ఈ చిత్రం మ‌నోజ్‌కు హీరోగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ త‌రువాత నుంచి విభిన్న‌మైన క‌థ‌ల్ని ఎంచుకుంటూ మంచు మ‌నోజ్ త‌న‌దైన ముద్ర వేయాల‌ని త‌పించారు. ఈ క్ర‌మంలో కొన్ని ఫ్లాపులు, కొన్ని హిట్‌లు ల‌భించాయి.

- Advertisement -

`ఒక్క‌డు మిగిలాడు` చిత్రం త‌రువాత మంచు మ‌నోజ్ చాలా కాలం ఇండ‌స్ట్రీకి దూరంగా వుంటూ వ‌చ్చారు. వ్య‌క్త‌గత జీవితంలో ఏర్ప‌డిన ఇబ్బందుల కార‌ణంగా సినిమాల‌కు దూర‌మ‌య్యారు. తాజాగా ఆయ‌న మ‌ళ్లీ న‌టించడం మొద‌లుపెట్టారు. ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం `అహం బ్ర‌హ్మ‌స్మి`. శ్రీ‌కాంత్ ఎన్‌. రెడ్డి ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రంలో మ‌నోజ్ విక్ర‌మ‌సింహ‌పురి రాజాగా క‌నిపించ‌బోతున్నారు. ఈ సంద‌ర్భంగా చిత్ర బృందం విడుద‌ల చేసిన పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All