ఈ ఏడాది ప్రారంభంలో `సరిలేరు నీకెవ్వరు` చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు మహేష్. ఈ సక్సెస్ ఇచ్చిన ఆనందంలో వున్న ఆయన అందరిని ఆశ్చర్యపరుస్తూ యంగ్ డైరెక్టర్ పరశురామ్తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన నటిస్తున్న తాజా చిత్రం `సర్కారు వారి పాట`. మైత్రీ మూవీమేకర్స్, 14 ప్లస్ రీల్స్ , జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సూపర్స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ ప్రీలుక్తో పాటు టైటిల్ పోస్టర్ని చిత్ర బృందం రిలీజ్ చేసింది. అప్పటి నుంచి ఈ చిత్రంలో మహేష్కు జోడీగా ఎవరు నటిస్తారా అని చర్చ మొదలైంది. కీర్తి సురేష్ నటించనుందని వెల్లడించినా మేకర్స్ కానీ, మహేష్ కానీ ఈ విషయంపై ఎలాంటి స్పష్టతనివ్వలేదు. శనివారం కీర్తిసురేష్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా మహేష్ `సర్కారు వారి` పాట హీరోయిన్పై నెలకొన్ని సస్పెన్స్కు తెర దించారు.
సూపర్ టాలెంటెడ్ కీర్తి సురేష్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు అని తెలియజేసిన మహేష్ `సర్కారు వారి పాట` టీమ్ మీకు వెల్కమ్ చెబుతోందని, మోస్ట్ మెమోరబుల్ ఫిలింస్లలో ఒకటిగా నిలిపేందుకు ప్రయత్నిద్దామని ట్వీట్ చేసి క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుంచి ప్రారంభం కానుందని తెలిసింది.
Here’s wishing the super talented @KeerthyOfficial a very happy birthday!! Team #SarkaruVaariPaata welcomes you aboard!! Will make sure it’s one of your most memorable films??? Have a great one !! ??? pic.twitter.com/MPzEWc0uGE
— Mahesh Babu (@urstrulyMahesh) October 17, 2020