ఈ సంక్రాంతికి రెండు భారీ చిత్రాలు పోటీపడ్డాయి, ఒకటి సరిలేరు నీకెవ్వరు, మరొకటి అల వైకుంఠపుమరులో. 22 రోజులు దాటినా వీటి కలెక్షన్స్లో ఎలాంటి మార్పు లేదు. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని సాధిస్తూ సరికొత్త రికార్డులు సాధిస్తున్నాయి. మహేష్ నటించిన `సరిలేరు నీకెవ్వరు` రిలీజై 22 డేస్ అవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్ర వరల్డ్ వైడ్ కలెక్షన్ల వివరాలు ఇలా వున్నాయి.
తొలి వారంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 80 కోట్ల సాధించిన ఈ చిత్రం రెండవ వారం పూర్తయ్యే సరికి టాప్ 4లో నిలిచి రెండు తెలుగు రాష్ట్రాల్లో 106.6 కోట్ల షేర్ని సాధించి ఆల్టైమ్ రికార్డు సాధించిన చిత్రాల్లో 4వ స్థానంలో నిలిచింది. 22 రోజుల్లో 115 కోట్ల షేర్ని సాధించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్గా 140 కోట్ల షేర్ని వసూలు చేయడం విశేషం.
ఆంధ్రా- తెలంగాణ 22 డేస్ షేర్ వివరాలు:
నైజాం – 38.8 కోట్లు
సీడెడ్ – 16.07 కోట్లు
గుంటూరు – 9.7 కోట్లు
ఉత్తరాంధ్ర – 19.73 కోట్లు
తూర్పు గోదావరి – 11.05 కోట్లు
పశ్చిమ గోదావరి – 7.3 కోట్లు
కృష్ణా – 8.7 కోట్లు
నెల్లూరు – 4.05 కోట్లు
22 రోజుల మొత్తం షేర్ – 115.4 కోట్లు
కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా – 11.9 కోట్లు
ఓవర్సీస్ – 12.70 కోట్లు
వరల్డ్ వైడ్ 22 డేస్ షేర్ – 140 కోట్లు