Homeటాప్ స్టోరీస్మహేష్ కూడా రంగంలోకి దిగుతున్నాడు

మహేష్ కూడా రంగంలోకి దిగుతున్నాడు

మహేష్ కూడా రంగంలోకి దిగుతున్నాడు
మహేష్ కూడా రంగంలోకి దిగుతున్నాడు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా మరోసారి తనను తాను నిరూపించుకున్నాడు. బిగ్ బాస్ హోస్ట్ చేసిన నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు షో ను హోస్ట్ చేస్తున్నాడు ఎన్టీఆర్. ఈ షో కు రికార్డ్ రేటింగ్స్ వస్తున్న విషయం తెల్సిందే. మొదటి వారానికి మించి మూడో వారం రేటింగ్స్ రావడంతో టీమ్ అంతా ఖుషిగా ఉన్నారు.

ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమం కర్టెన్ రైజర్ కార్యక్రమానికి రామ్ చరణ్ విచ్చేసిన విషయం తెల్సిందే. ఇక రేపు స్టార్ దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి, కొరటాల శివ వస్తున్నారు. ఇంతే కాకుండా ఎవరు మీలో కోటీశ్వరులు నిర్వాహకులు ఇప్పుడు మరో స్పెషల్ గెస్ట్ ను ఆహ్వానించారు.

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు ఎవరు మీలో కోటీశ్వరులుకు స్పెషల్ గెస్ట్ గా వస్తాడని సమాచారం. అక్టోబర్ లో దసరా సందర్భంగా ఈ స్పెషల్ ఎపిసోడ్ ను టెలికాస్ట్ చేయనున్నారు. ఎన్టీఆర్, మహేష్ ఒకే స్క్రీన్ పై కనిపిస్తారన్న వార్తతో అటు మహేష్, ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఆనందంగా ఉన్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All